News September 30, 2024
తిరుమల లడ్డూ వివాదం.. దూకుడు పెంచిన సిట్

AP: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. నెయ్యి సరఫరా చేసిన కంపెనీ చరిత్రపై ఆరా తీస్తోంది. సంస్థ యజమాని నుంచి నెయ్యి ట్యాంకర్ డ్రైవర్ వరకూ అందరినీ ప్రశ్నించనుంది. అవసరమైతే TTD మాజీ పెద్దలకు నోటీసులిస్తామని, టెండర్లపై విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందన్నారు.
Similar News
News January 6, 2026
ఆకివీడు: షైనీ ప్రతిభను మెచ్చి కేంద్ర మంత్రి అభినందనలు

అంతర్జాతీయ స్థాయిలో మల్టీ టాలెంటెడ్ అవార్డుతో పాటు ఇటీవల ‘నంది’ అవార్డు గెలుచుకున్న ఆకివీడు మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ శిష్యురాలు ఘంటా షైనీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అభినందించారు. మంగళవారం ఆయనను కలిసిన షైనీని మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
News January 6, 2026
రాష్ట్రంలో 424 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 6, 2026
సక్సెస్తో వచ్చే కిక్కే వేరు: CBN

AP: 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లోనూ ముందుకెళ్లాలని CM CBN SIPB సమావేశంలో సూచించారు. ‘టాటా, జిందాల్, బిర్లా, ADANI, RIL,TCS, కాగ్నిజెంట్ వంటివి పెట్టుబడులు పెడుతున్నాయి. గ్రౌండింగ్లో పొరపాట్లకు తావుండొద్దు. 2029కి విద్యుత్ కొనుగోలు ఛార్జీ ₹3.70కి తగ్గేలా చేద్దాం’ అని పేర్కొన్నారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని, దాని కోసం అందరూ పని చేయాలని వ్యాఖ్యానించారు.


