News September 30, 2024
తిరుమల లడ్డూ వివాదం.. దూకుడు పెంచిన సిట్
AP: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. నెయ్యి సరఫరా చేసిన కంపెనీ చరిత్రపై ఆరా తీస్తోంది. సంస్థ యజమాని నుంచి నెయ్యి ట్యాంకర్ డ్రైవర్ వరకూ అందరినీ ప్రశ్నించనుంది. అవసరమైతే TTD మాజీ పెద్దలకు నోటీసులిస్తామని, టెండర్లపై విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందన్నారు.
Similar News
News September 30, 2024
‘బురారీ’ తరహాలోనే తండ్రి, నలుగురు కూతుళ్లు ఆత్మహత్య!
2018లో ఢిల్లీ బురారీలోని ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది. తాజాగా దేశ రాజధానిలోని వసంత్కుంజ్లో తండ్రి, నలుగురు కూతుళ్లు సూసైడ్ చేసుకున్నారు. ఇది కూడా బురారీ ఘటన తరహాలో తాంత్రిక పూజల్లో భాగంగానే జరిగిందనే అనుమానాలొస్తున్నాయి. వారి మెడ, మణికట్టుకు ఎరుపు, పసుపు దారాలను పోలీసులు గుర్తించారు. వారంతా విషం కలిపిన స్వీట్లను తిన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News September 30, 2024
అందుకే T20లకు రిటైర్మెంట్ ప్రకటించా: రోహిత్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్-2024 గెలిచాక ఆ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెనకున్న కారణాలను ఆయన తాజాగా వెల్లడించారు. ‘నేను 17 ఏళ్లు ఈ ఫార్మాట్ను ఆస్వాదించా. వరల్డ్ కప్ గెలవడంతో ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం అనిపించింది. టీమ్ఇండియాలో గొప్ప ప్లేయర్లున్నారు. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపారు.
News September 30, 2024
OTTలోనూ దుమ్మురేపుతోన్న ‘సరిపోదా శనివారం’
నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఇప్పటికే థియేటర్లలో రూ.100కోట్ల+ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం ఈనెల 26 నుంచి ‘నెట్ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. OTT ప్రేక్షకులను సైతం మెప్పిస్తూ దేశవ్యాప్తంగా నంబర్ 1లో ట్రెండ్ అవుతోందని హీరో నాని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సాలిడ్ మ్యూజిక్ అందించారు.