News September 26, 2024

తిరుమల లడ్డూ వివాదం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఆలయాల్లో వినియోగించే నెయ్యి, ఇతర పదార్థాలను తనిఖీ చేసి ల్యాబ్‌కు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై లడ్డూలు, ప్రసాదాల తయారీకి ప్రభుత్వ పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డెయిరీ నుంచే నెయ్యి, పాలను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆలయాల ప్రతినిధులు కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేశారని తెలిసి సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Similar News

News January 30, 2026

ఆదివారమూ స్టాక్ మార్కెట్.. చరిత్రలో రెండోసారి

image

సాధారణంగా స్టాక్ మార్కెట్లకు సండే సెలవు. కానీ వచ్చే ఆదివారం(FEB 1) NSE, BSE ఓపెన్‌లో ఉండనున్నాయి. ఆ రోజున కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండటమే దీనికి కారణం. ప్రభుత్వ పాలసీలు, ప్రకటనలపై ఇన్వెస్టర్లు స్పందించేందుకు వీలుగా ట్రేడింగ్ కొనసాగుతుంది. ఈక్విటీ మార్కెట్స్ ఆదివారమూ ఓపెన్‌లో ఉండటం చరిత్రలో ఇది రెండోసారి. తొలిసారి FEB 28(సండే), 1999న యశ్వంత్ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడూ మార్కెట్లు పనిచేశాయి.

News January 30, 2026

రోజుకు లక్షన్నర బ్యారెల్స్.. రష్యా నుంచి ఇండియాకు!

image

రష్యా నుంచి పెద్దమొత్తంలో క్రూడాయిల్‌ను రిలయన్స్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఫిబ్రవరి నుంచి రోజూ సుమారు 1.5 లక్షల బ్యారెల్స్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటామని కంపెనీ చెప్పిందని రాయిటర్స్ తెలిపింది. అమెరికా ఆంక్షల లిస్టులో లేని రష్యన్ కంపెనీల నుంచి రానున్న 2 నెలలు కొననుందని వెల్లడించింది. US ఆంక్షల నుంచి మినహాయింపు తీసుకుని డిసెంబర్‌లోనూ రష్యా క్రూడ్‌ను కొనిందని చెప్పింది.

News January 30, 2026

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో పోస్టులు

image

<>BRIC-<<>>నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును డిగ్రీ (లైఫ్ సైన్సెస్, BVSc, B.Pharma), పీజీ(లైఫ్ సైన్సెస్)అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 17వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌కు నెలకు రూ.48వేలు, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.54,600 చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.niab.org.in