News August 29, 2024
తిరుమల లడ్డూ మరింత రుచికరం

AP: తిరుమల లడ్డూను మరింత రుచికరంగా మార్చేందుకు TTD కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లడ్డూల తయారీకి వాడిన నందిని నెయ్యిని తిరిగి వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకు KMF(కర్ణాటక మిల్క్ ఫెడరేషన్)తో ఒప్పందం కుదుర్చుకుంది. కేజీ రూ.470 చొప్పున కొనుగోలు చేయనుంది. యూపీకి చెందిన ఆల్ఫా సంస్థ కూడా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. కాగా లడ్డూ, ఇతర ప్రసాదాల కోసం టీటీడీ రోజుకు 10 వేల కేజీల నెయ్యి వినియోగిస్తోంది.
Similar News
News October 23, 2025
రూ.79వేల కోట్ల ప్రతిపాదనలకు రక్షణశాఖ ఆమోదం

రూ.79వేల కోట్లతో ఆయుధాలు, పరికరాలు కొనుగోలు చేసేందుకు త్రివిధ దళాలకు ఆమోదం లభించింది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో నిర్వహించిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో ఈ ప్రతిపాదనలను ఆమోదించారు. ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ, అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పిడోలు, నాగ్ క్షిపణి వ్యవస్థ, ల్యాండింగ్ ప్లాట్ఫాం డాక్స్, 30MM నేవల్ సర్ఫేస్ గన్స్, హై మొబిలిటీ వెహికల్స్, ట్రాక్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.
News October 23, 2025
ఆ టీడీపీ ఎమ్మెల్యేపై వేటు తప్పదా?

AP: తిరువూరు TDP MLA కొలికపూడి శ్రీనివాస్పై అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు. గతంలో TDP నేత రమేశ్రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రచ్చకెక్కారు. తర్వాత MP కేశినేని చిన్నితో గొడవలు మొదలయ్యాయి. ఇవాళ ఆ <<18082832>>వివాదం<<>> తారస్థాయికి చేరడంతో CBN సీరియస్ అయ్యారు. ఇక మాటల్లేవని స్పష్టం చేశారు. దీంతో కొలికపూడిపై వేటు వేస్తారా? అనే చర్చ మొదలైంది.
News October 23, 2025
కేసీఆర్పై MP మల్లు రవి ఆగ్రహం

TG: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను BRS చీఫ్ KCR <<18084451>>రౌడీ షీటర్<<>> అనడంపై MP మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘BC బిడ్డను రౌడీ షీటర్ అని అవమానిస్తారా? నవీన్ యాదవ్ మంచి విద్యావంతులు, పేదలకు సాయం చేసే గుణమున్నవాడు. ఆయనపై మీ అగ్రవర్ణ అహంకారాన్ని చూపిస్తారా. కేసీఆర్ బీసీలందరినీ అవమానించినట్లే. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అని ధీమా వ్యక్తం చేశారు.