News August 2, 2024

తిరుమల లడ్డూ ప్రసాదానికి 308 ఏళ్లు

image

AP: వేంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం లడ్డూ. ఎవరైనా తిరుమల వెళ్లొస్తే ముందుగా అడిగేది దీనినే. ఎంతో ప్రాముఖ్యత గల లడ్డూని తిరుమలలో ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి నేటికి 308 ఏళ్లు పూర్తైంది. 1715 AUG 2న లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. ఆలయపోటులో స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, పచ్చకర్పూరంతో ప్రత్యేక పద్ధతుల్లో దీన్ని తయారుచేస్తారు.

Similar News

News April 5, 2026

TODAY HEADLINES

image

*దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లను కోల్పోవు: మోదీ
*ఏపీ కొత్త మ్యాప్ విడుదల
*₹57,821 కోట్లతో అమరావతి నిర్మాణాలు: CBN
*ఆలయాల వద్ద రాజకీయ కార్యకలాపాలపై నిషేధం: రేవంత్
*అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి బాధితుల లేఖ
*రాఘవ్ చడ్ఢా బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం
*48 గంటల్లో హార్ముజ్‌ను తెరవకపోతే ప్రళయమే: ట్రంప్
*IPL: ముంబైపై ఢిల్లీ, గుజరాత్‌పై రాజస్థాన్ గెలుపు

News April 5, 2026

ఈవెంట్‌లో సినీతారలు.. మరోసారి డ్రగ్స్ కలకలం

image

TG: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గోల్కొండ తారామతి రిసార్టులో జాక్ జాన్సన్ ఈవెంట్‌పై ఈగల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పలువురు సినీతారలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏడుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఇందులో పాల్గొన్న వారందరికీ పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

News April 4, 2026

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి బాధితుల లేఖ

image

గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు 30 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ ఫ్లైట్ డేటా రికార్డర్ డేటాను విడుదల చేయాలని కోరారు. బహిరంగంగా కుదరకపోతే తమకైనా ఆ వివరాలు ఇవ్వాలన్నారు. విమానం ఎందుకు కూలిందో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఫ్లైట్‌లోని 242 మందికి గాను 241 మంది, 19 మంది ఇతరులు మరణించిన విషయం తెలిసిందే.