News April 20, 2024
ఒంటిమిట్ట రాములోరికి తిరుమల లడ్డూలు

AP: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి టీటీడీ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. నిన్న 1.20 లక్షల లడ్డూలను తిరుమల నుంచి ఒంటిమిట్టకు పంపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాముల బరువు ఉంటుంది. ఒంటిమిట్టలో ఏప్రిల్ 22న సా.6.30 గంటల నుంచి శ్రీసీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది.
Similar News
News March 28, 2026
నిహారిక నిర్మాతగా వరుణ్ తేజ్ ‘బరి’

వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ యదు వంశీతో చేయనున్నారు. ‘బరి’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీ పల్లెటూరి నేపథ్యంలో సాగే వాలీబాల్ స్పోర్ట్స్ డ్రామా. వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల దీన్ని నిర్మిస్తుండటం విశేషం. పవన్ ముఖ్య అతిథిగా నేడు పూజా కార్యక్రమం జరగనుంది. 2027 సంక్రాంతి రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్టోరీని వివరించడానికి AI వీడియోను యూనిట్ ప్లాన్ చేస్తోంది.
News March 28, 2026
నో టెన్షన్.. బంకుల్లో తగ్గిన రద్దీ

TG: హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గింది. 3-4 రోజులుగా విపరీతమైన రద్దీతో బంకుల వద్ద గందరగోళం నెలకొంది. అయితే సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందవద్దని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా సరఫరా చేయడంతో ఎట్టకేలకు ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. అటు ఆయిల్ కంపెనీలు సైతం క్రెడిట్ రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించుకున్నట్లు సమాచారం.
News March 28, 2026
విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏప్రిల్లో భూమి పూజ?

AP: విశాఖలో గూగుల్ మెగా డేటా సెంటర్ ఏర్పాటుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. నిర్మాణ అనుమతుల కోసం బిల్డింగ్ ప్లాన్ను సంస్థ ప్రభుత్వానికి సమర్పించింది. పర్యావరణానికి నష్టం లేకుండా చెరువులు, నీటి కుంటలను యథాతథంగా ఉంచుతూ అభివృద్ధి చేస్తామని తెలిపింది. అనుమతులు రాగానే ఏప్రిల్లో భూమి పూజ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 601 ఎకరాలను కేటాయించింది.


