News December 20, 2024

గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు

image

AP: తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. AI టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వారం రోజులు పరిశీలించి దర్శనం కల్పిస్తామన్నారు. ఇందుకోసం భక్తుల ఆధార్, ఫొటో తీసుకుని దర్శనం సమయం సూచించే టోకెన్ ఇస్తారు. ఆ సమయానికి వచ్చే భక్తులను దర్శనం కోసం నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి పంపుతారు. సక్సెస్ అయితే 45 కౌంటర్లలో టోకెన్లు ఇవ్వనున్నారు.

Similar News

News November 20, 2025

గంభీర్‌పై విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

image

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓడటంతో హెడ్ కోచ్ గంభీర్‌పై <<18307995>>విమర్శలొచ్చిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పందించారు. ‘గంభీర్ ఒక్కడినే టార్గెట్ చేస్తూ అందరూ మాట్లాడుతున్నారు. బ్యాటర్లు, బౌలర్లు, సపోర్ట్ స్టాఫ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. కోల్‌కతా పిచ్‌ను మేం బ్లేమ్ చేయట్లేదు. అది అంత త్వరగా టర్న్ అవుతుందని ఊహించలేదు’ అని పేర్కొన్నారు.

News November 20, 2025

ఏపీని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తాం: DGP

image

AP: 2026 మార్చి నాటికి రాష్ట్రంలో మావోయిజాన్ని అంతం చేస్తామని DGP హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. రంపచోడవరంలోని AOB ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే చేశారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. 50 మంది మావోలను అరెస్ట్ చేశామన్నారు. APని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తామని, ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

News November 20, 2025

విశ్వాన్ని నడిపించే అత్యున్నత శక్తి ‘విష్ణువు’

image

పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం|
దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా||
పవిత్రతకు మూలం, శుభాలకు ఆరంభం విష్ణుమూర్తియే. అతి పవిత్రమైన, అతి మంగళకరమైన ఆ దేవదేవుడను దేవతలే దైవంగా కొలిచి, ఆరాధిస్తారు. ఈ లోకంలోని సకల జీవులకు ఆయనే ఆశ్రయమిస్తాడని నమ్ముతారు. ఈ విశ్వాన్ని నడిపించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ప్రతి జీవికి ఆయనే స్థిరమైన ఆధారం. సరైన మార్గాన్ని చూపించే గురువు విష్ణు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>