News November 1, 2024
తిరుమల శ్రీవారి వస్త్రాలు ఈ-వేలం.. ఎప్పటినుంచంటే?

AP: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన వస్త్రాలను TTD వేలం వస్తోంది. నవంబర్ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్ వేలంలో వీటిని దక్కించుకోవచ్చు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 358 లాట్లు ఉన్నట్లు టీటీడీ తెలిపింది. పూర్తి వివరాలకు తిరుపతిలోని TTD మార్కెట్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో లేదా టీటీడీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపింది.
Similar News
News February 17, 2026
ESIC కాన్పూర్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులు

<
News February 17, 2026
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. ఎక్కడుందంటే?

గుజరాత్లోని మాదాపర్ సుమారు ₹7,000 కోట్ల బ్యాంక్ డిపాజిట్లతో ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ 17కు పైగా బ్యాంక్ శాఖలు ఉండటం విశేషం. ఇక్కడి కుటుంబీకులు విదేశాల్లో స్థిరపడినా తమ సంపాదనను సొంత ఊరి బ్యాంకుల్లోనే పొదుపు చేస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. వీరి పొదుపు మంత్రం, పుట్టిన ఊరిపై ఉన్న మమకారం ప్రతి గ్రామానికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.
News February 17, 2026
మొక్కజొన్నలో కత్తెర పురుగు కట్టడికి విషపు ఎర తయారీ విధానం

మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను మొక్క సుడిలో సాయంకాలం వేయాలి. దీని కోసం ఎకరానికి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని 2-3 లీటర్ల నీటిలో కరిగించి తర్వాత తవుడులో కలిపి ఆ మిశ్రమాన్ని 24 గంటల పాటు పులియనిచ్చి, అరగంట ముందు ఈ మిశ్రమానికి 100 గ్రాముల థయోడికార్బ్ మందును కలిపి విషపు ఎరను మొక్క సుడిలో వేయాలి.


