News November 1, 2024
తిరుమల శ్రీవారి వస్త్రాలు ఈ-వేలం.. ఎప్పటినుంచంటే?

AP: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన వస్త్రాలను TTD వేలం వస్తోంది. నవంబర్ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్ వేలంలో వీటిని దక్కించుకోవచ్చు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 358 లాట్లు ఉన్నట్లు టీటీడీ తెలిపింది. పూర్తి వివరాలకు తిరుపతిలోని TTD మార్కెట్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో లేదా టీటీడీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపింది.
Similar News
News November 24, 2025
GNT: ఆస్తి పన్ను వసూళ్లలో కట్టుదిట్టం

జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో రసీదు పుస్తకాల దుర్వినియోగంతో పన్ను సొమ్ము పక్కదారి పడుతోంది. పన్ను చెల్లించినా మళ్లీ రసీదులు ఇస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఆన్లైన్ విధానాన్ని అమలు చేసింది. వాట్సాప్ ద్వారా నోటీసులు పంపి, క్యూఆర్ కోడ్ యూపీఐతో చెల్లించిన వెంటనే రసీదు మొబైల్కి వస్తోంది. ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్లకుండా ఖాతాకు జమ అవుతోంది. మొత్తం బకాయిలు రూ.47.82 కోట్లు.
News November 24, 2025
ధర్మేంద్ర గురించి తెలుసా?

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్లోని బికనీర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.
News November 24, 2025
ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

<


