News February 22, 2025
Tirumala Update: రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనానికై వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,327మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22,804మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.3.52 కోట్ల ఆదాయం లభించింది.
Similar News
News December 31, 2025
EVMలతో కాదు.. ఓటర్ లిస్టులతోనే అవకతవకలు: TMC

ఓటర్ లిస్ట్లో అవకతవకలతో ఓట్ చోరీ జరుగుతోందని, EVMల ద్వారా కాదని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. బెంగాల్లో SIR తర్వాత ఎలక్టోరల్ రోల్స్పై పార్టీల అనుమానాలను నివృత్తి చేయడంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిలైందని ఆరోపించారు. ఓటర్ల సంఖ్యలో తేడాలుంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ను TMC అంగీకరించదని, లీగల్గా పోరాడుతుందన్నారు. 10 మంది పార్టీ లీడర్లు ECని కలిసిన తర్వాత అభిషేక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News December 31, 2025
కంటెంట్ క్రియేటర్లకు మస్క్ గుడ్న్యూస్

‘X’లో క్వాలిటీ ఒరిజినల్ కంటెంట్ పొందడానికి క్రియేటర్లకు ఇచ్చే పేమెంట్స్ పెంచాలన్న ప్రపోజల్పై మస్క్ పాజిటివ్గా స్పందించారు. ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసే వారికి చెల్లించే మొత్తాన్ని భారీగా పెంచనున్నట్టు ప్రకటించారు. అయితే కంటెంట్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పారదర్శకంగా, కచ్చితంగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. చెల్లింపుల్లో యూట్యూబ్ అద్భుతంగా ఉందని అంగీకరించారు.
News December 31, 2025
గోదావరి నీటి మళ్లింపును అంగీకరించం: ఉత్తమ్

TG: AP ప్రణాళికలను అడ్డుకొని రాష్ట్ర నీటి వాటాను పరిరక్షించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. ‘గోదావరి నీళ్ల మళ్లింపును అంగీకరించం. ఏకపక్షంగా మళ్లించేందుకు ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదు. వారి నిర్ణయం CWC, GWDT తీర్పునకు భిన్నంగా ఉంది. అదనపు నీటి హక్కుల కోసం AP రూపొందించిన ప్రణాళికలకు వ్యతిరేకంగా ప్రభుత్వం న్యాయ పోరాటానికి పూనుకుంది. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని తెలిపారు.


