News October 1, 2024
తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి: కేఏ పాల్

AP: తిరుమల తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే తప్పేంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించారు. వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లే తిరుమలనూ UT చేయాలని డిమాండ్ చేశారు. ‘ఎన్నికల హామీల దృష్టి మరల్చేందుకే లడ్డూ వివాదం సృష్టించారు. చంద్రబాబు అసలు హిందువే కాదు.. నాస్తికుడు. పవన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారు. లడ్డూపై రాజకీయ ప్రచారం ఆపాలి’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News November 25, 2025
కుర్రాళ్ల ఓపికకు ‘టెస్ట్’!

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో మన కుర్రాళ్లు తేలిపోతున్నారు. ఒకప్పుడు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ రోజుల తరబడి క్రీజులో నిలబడేవారు. బౌలర్ల సహనాన్ని పరీక్షించేవారు. కానీ ఇప్పుడున్న ప్లేయర్లు పరుగులు చేయడం అటుంచితే కనీసం గంట సేపైనా ఓపికతో మైదానంలో ఉండలేకపోతున్నారు. కోహ్లీ, రోహిత్, పుజారా, రహానేల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన పంత్, నితీశ్, సుదర్శన్, జురెల్ దారుణంగా విఫలమవుతున్నారు.
News November 25, 2025
భార్య గర్భంతో ఉంటే.. భర్త ఇవి చేయకూడదట

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకపోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ‘చెట్లు నరకడం, సముద్ర స్నానం చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే క్షౌరం కూడా చేయించుకోకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చావు ఇంటికి వెళ్లడం మంచిది కాదు. శవాన్ని మోయడం అశుభంగా భావిస్తారు. గృహ ప్రవేశం, వాస్తు కర్మలు వంటివి కూడా చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తే దీర్ఘాయువు గల బిడ్డ జన్మిస్తుంది’ అని సూచిస్తున్నారు.
News November 25, 2025
CSIR-NEERIలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI) 14 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 23వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, M.Tech, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://neeri.res.in


