News August 21, 2024

వైద్యుల ఆందోళనను జవాన్లతో ముడిపెట్టిన TMC

image

వైద్యురాలిపై హత్యాచారానికి నిరసగా ఆందోళన చేస్తున్న వైద్యవర్గాలను ఎలా సముదాయించాలో TMCకి అర్థమవ్వడం లేదు. అందుకే జవాన్లతో పోలిక పెట్టింది. ‘సమ్మెను ఆపాలని కోరుతున్నాం. మీకో ప్రశ్న. పుల్వామా ఘటనలో అసలు న్యాయమే జరగలేదు. అలాగని జవాన్లు సరిహద్దుల్ని వదిలేసి వీ వాంట్ జస్టిస్ అంటూ నిరసనకు దిగితే ఎలా ఉంటుందో చెప్పండి’ అని TMC నేత కునాల్ ఘోష్ అన్నారు. ఆర్జీకర్ ఘటనపై పార్టీ వైఖరేంటో ఆయనే వివరిస్తున్నారు.

Similar News

News December 22, 2025

‘SHANTI’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

image

సస్టైనబుల్ హార్నెస్సింగ్ & అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా(SHANTI) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో దేశంలో సివిల్ న్యూక్లియర్ సెక్టార్‌లో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యానికి మార్గం సుగమమైంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న అటామిక్ ఎనర్జీ యాక్ట్-1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్-2010ను కేంద్రం రద్దు చేసింది.

News December 22, 2025

మోదీ, షాల వల్లే నక్సలిజం తగ్గింది: ఛత్తీస్‌గఢ్ సీఎం

image

AP: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నిర్ణయాల వల్లే తమ రాష్ట్రంలో నక్సలిజం చాలా వరకు తగ్గిందని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ తెలిపారు. రాజమండ్రిలో నిన్న మాజీ PM అటల్ బిహార్ వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కొన్ని దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా తమ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడక్కడా నక్సలిజం ఉందని, దాన్నీ పూర్తి స్థాయిలో రూపుమాపుతామని స్పష్టం చేశారు.

News December 22, 2025

105 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా.. సీక్రెట్ ఇదే

image

స్వాతంత్ర్య సమరయోధుడు, రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి ఏటుకూరి కృష్ణమూర్తి త్వరలో 105వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. వందేళ్లకు పైగా జీవించి ఇప్పటికీ పెన్షన్ అందుకుంటున్న ఏకైక తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆయన, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. తన ఆరోగ్య రహస్యం శాకాహార భోజనం, మితాహారం, నిత్య వ్యాయామమే అని చెబుతున్నారు. యువత మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు.