News June 18, 2024

శరద్ పవార్‌ను కలిసిన TMC ఎంపీలు

image

NCP(SP) అధినేత శరద్ పవార్‌ను TMC MPల బృందం కలిసింది. స్టాక్ మార్కెట్ మేనిపులేషన్‌పై విచారణ జరిపించాలనే వారి డిమాండ్‌కు పవార్ మద్దతిచ్చారు. తప్పుడు ఎగ్జిట్ పోల్స్‌తో మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్‌ను మేనిపులేట్ చేశారని TMC అధినేత్రి, WB CM మమత ఆరోపిస్తున్నారు. BJP ‘బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ స్కామ్’కు పాల్పడటంతో ఇన్వెస్టర్లు రూ.30లక్షల కోట్లు నష్టపోయినట్లు రాహుల్ సైతం ఆరోపణలు గుప్పించారు.

Similar News

News September 15, 2025

మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు పెట్టిన దరఖాస్తు వివరాలను 1100 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని వెల్లడించారు.

News September 15, 2025

సమ్మె విరమించమని కోరాం: భట్టి

image

TG: ప్రైవేటు కళాశాలలు <<17708995>>బందు<<>>కు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యాలతో Dy.CM భట్టి విక్రమార్క అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ‘చర్చలు సానుకూలంగా సాగాయి. సమస్యలు అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు’ అని తెలిపారు. బంద్ నిర్ణయంలో కళాశాలలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇవాళ మ.3 గం.కు మరోసారి చర్చలు జరగనున్నాయి.

News September 15, 2025

ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా?

image

సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘ఇండియా పోస్ట్’ పేరిట ఫేక్ మెసేజులు పంపుతున్నారు. ‘మీ పార్సిల్ వేర్ హౌస్‌కి చేరుకుంది. అడ్రస్ సరిగ్గా లేకపోవడంతో డెలివరీ కుదర్లేదు. ఈ లింక్ ఓపెన్ చేసి 48 గంటల్లోగా అడ్రస్ అప్‌డేట్ చేయండి. లేదంటే పార్సిల్ రిటన్ వెళ్లిపోతుంది’ అని మెసేజ్‌లు పంపుతున్నారు. అవన్నీ ఫేక్ అని PIB FACT CHECK తేల్చింది. మీ వాళ్లకి ఈ విషయం షేర్ చేయండి.