News October 26, 2024

TNGOలతో కలిసి పని పనిచేస్తాం RTC JAC

image

TGSRTC ఇకనుంచి టీఎన్జీవోతో కలిసి పని చేయనున్నట్లు RTC JAC ప్రకటించింది. టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన 2 జేఏసీల ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో సంయుక్తంగా పోరాట కార్యక్రమం రూపొందించుకుంటామని తెలిపారు. JAC వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News February 27, 2026

మేడ్చల్: వృద్ధుడికి సెంచరీ సెలబ్రేషన్స్.. అంతలోపే

image

ఆయనకు నిండునూరేళ్లు నిండాయి. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేద్దామని కుటుంబం ఏర్పాట్లు చేసుకుంది. అంతలోనే ఆ వృద్ధుడు మృతిచెందారు. బీదర్‌కు చెందిన దొండచార్య జోషి(100) బోడుప్పల్ గాయత్రినగర్‌లో స్థిరపడ్డారు. బీదర్ HYD సంస్థానంలో ఉన్న సమయంలో రజాకార్ల దౌర్జన్యంపై ఈయన దండెత్తారు. KA, MH రాష్ట్రాల విభజనలో పాల్గొన్నారు. గతేడాది బోడుప్పల్‌లో అఖిల బ్రాహ్మణ వికాస సమితీ ఆధ్వర్యంలో 99వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

News February 27, 2026

HYD: ఛీ.. ఛీ.. శవాల మీద పేలాలు ఏరుకోవడమంటే ఇదేనేమో..!

image

అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది GHMC తీరు. ఆఖరికి ప్రజారోగ్యానికి చేసే దోమల ఫాగింగ్‌లోనూ స్కాంకు పాల్పడుతున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి సర్కిల్‌లో ఫాగింగ్‌కు వాడే డీజిల్‌ను సూపర్వైజర్లు, AE, SEల అండతో సిబ్బంది రూ.10ల కమీషన్ చొప్పున పెట్రోల్ బంకులకు అమ్ముకుంటోంది. పంపకాల్లో తేడాలు రావడంతో ఈ ‘దోమల దండు’ బాగోతం బయటకు పొక్కింది. కాగా ప్రభుత్వం దోమల నివారణకు ఏడాదికి రూ.32 కోట్లు ఖర్చు చేస్తోంది.

News February 27, 2026

HYD: సారూ.. అందెశ్రీకి ఇచ్చే గౌరవం ఇదేనా?

image

ప్రముఖ కవి, TG గేయ రచయిత అందెశ్రీ మరణించి 108 రోజులు గడిచినా సమాధి కోసం ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడం సిగ్గుచేటని జనాలు మండిపడుతున్నారు. TG ఉద్యమానికి స్వరం ఇచ్చిన కవికి కనీస గౌరవం లేకపోవడం దురదృష్టకరమని దుమ్మెత్తిపోస్తున్నారు. పాడె మోసి, స్మృతి వనం కడతామని హామీ ఇచ్చిన సీఎం మాటలు నీటి మూటలయ్యాయని కొందరు పెదవి విరుస్తున్నారు. నెలలు గడుస్తున్నా సమాధి పనులు మొదలుకాకపోవడంపై విమర్శలొస్తున్నాయి.