News September 20, 2024
సిట్టింగ్ జడ్జి/ హైకోర్టు కమిటీతో విచారించాలి:YCP

తిరుమల లడ్డూ ప్రసాదంపై CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై హైకోర్టును ఆశ్రయించినట్లు YCP ట్వీట్ చేసింది. ‘హైకోర్టులో వైసీపీ న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని హైకోర్టును న్యాయవాది కోరారు. పిల్ దాఖలు చేస్తే బుధవారం వాదన వింటామని ధర్మాసనం చెప్పింది’ అని YCP ట్వీట్ చేసింది.
Similar News
News January 25, 2026
CMను కాపాడేందుకే భట్టి అవాస్తవాలు: హరీశ్ రావు

TG: సింగరేణి టెండర్లపై Dy.CM <<18943021>>భట్టి విక్రమార్క<<>> చెప్పినవన్నీ అవాస్తవాలని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. CM రేవంత్ను ‘స్కామ్’ నుంచి కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో లేని సైట్ విజిట్ నిబంధనను తమ వారికి లబ్ధి చేకూర్చడానికే 2025లో తెచ్చారన్నారు. టెండర్ల ప్రక్రియలో నిపుణుల సంస్థలను పక్కన పెట్టి సింగరేణికి నష్టం కలిగించారని, లబ్ధిదారులెవరో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
News January 25, 2026
ICC నిర్ణయాన్ని గౌరవిస్తాం.. సవాలు చేయబోం: బంగ్లాదేశ్

T20 WC నుంచి తమను ICC తొలగించడంపై బంగ్లాదేశ్ అధికారికంగా స్పందించింది. <<18948168>>బోర్డు నిర్ణయాన్ని<<>> గౌరవిస్తున్నట్లు తెలిపింది. ‘మేం మా వంతు ప్రయత్నించాం. మ్యాచుల వేదికలు మార్చలేమని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాతా మా సొంత మార్గాల్లో ట్రై చేశాం. కానీ వాళ్లు సుముఖంగా లేకపోతే మేం మాత్రం ఏం చేయలేం. ఆ నిర్ణయాన్ని సవాలు చేయబోం’ అని BCB మీడియా కమిటీ ఛైర్మన్ అమ్జాద్ హుస్సేన్ చెప్పారు.
News January 25, 2026
నెయ్యితో సౌందర్య ప్రాప్తిరస్తు

నెయ్యి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు అందాన్ని పెంచడంలోనూ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. నెయ్యిలో ఉండే విటమిన్ A, ఫ్యాటీయాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు చర్మసౌందర్యాన్ని పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. నెయ్యిని స్నానం చేసే ముందు చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. పొడి చర్మం ఉన్నవారికి ఇది మాయిశ్చరైజర్లా పని చేస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని కాంతిమంతం చేయడంతో పాటు ముఖంపై ఉండే ముడతలను కూడా తగ్గిస్తుంది.


