News October 24, 2025
పాదాల పగుళ్లు తగ్గాలంటే..

కొందరికి సీజన్తో సంబంధం లేకుండా పాదాల పగుళ్లు ఇబ్బంది పెడతాయి. వీటికి ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. రోజూ పాదాలకు నూనె, మాయిశ్చరైజర్, తేనె, కలబంద వంటివి రాస్తుండాలి. అలాగే నిమ్మరసం, ఆలివ్ఆయిల్, బ్రౌన్ షుగర్ పేస్ట్ కలిపి పాదాలకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత మసాజ్ చేస్తూ క్లీన్ చేయాలి. పాదాలు ఆరాక మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా తరచూ చేస్తే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News October 25, 2025
దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు?

AP: రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఇదే బలమైన తుఫాన్ అని, ఈ నెల 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందన్నారు. 26 నుంచి 4 రోజుల పాటు ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా 28, 29 తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని అధికారులు సూచించారు. నేడు, రేపు చాలాచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.
News October 25, 2025
లవ్ మ్యారేజ్ చేసుకుంటా: అనుపమ

కెరీర్ ప్రారంభంలో ట్రోల్స్ వల్ల తాను బాధపడినట్లు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. బిగినింగ్లో ఓ స్కూల్ ఈవెంట్కి వెళ్లిన ఫొటోలు వైరలవ్వగా డబ్బులిస్తే పాన్ షాపు ఈవెంట్లకూ వెళ్తారని తనపై ట్రోల్స్ వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అని ప్రశ్నించగా ఫ్యామిలీ అనుమతితో చేసుకుంటానని ఆమె బదులిచ్చారు. తాను ప్రత్యేకంగా ఎలాంటి డైట్ పాటించనని, నచ్చిన ఫుడ్ తింటానని చెప్పారు.
News October 25, 2025
1,149 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,149 అప్రెంటిస్లకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు NCVT/SCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. వయసు 15 నుంచి 24ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://ecr.indianrailways.gov.in/


