News September 22, 2024

OTTల్లో పొగాకు హెచ్చరికలు తప్పనిసరి!

image

పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలపై హెచ్చరిక ప్రకటన OTTలకు తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈమేరకు సవరించిన ప్రతిపాదనలను కేంద్రం విడుదల చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ స్టేటస్‌తో సంబంధం లేకుండా ప్రసారమయ్యే అన్ని సినిమాలకు ప్రారంభంలో, మధ్యలో కనీసం 30సెకన్ల పొగాకు వ్యతిరేక ప్రకటన ప్రసారం చేయాల్సి ఉంటుంది. సినిమాల్లోనూ పొగాకు ఉత్పత్తులను వాడే సన్నివేశాల సమయంలో హెచ్చరికలు ప్రదర్శించాల్సి ఉంటుంది.

Similar News

News November 25, 2025

మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

image

మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో డిసెంబర్ 11న దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట, 14న రెండో విడతలో బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల్, తాండూరు, వేమనపల్లి, 17న మూడో విడతలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉ.7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి.

News November 25, 2025

బీజేపీ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షలు: బండి సంజయ్

image

TG: పంచాయతీ <<18387020>>ఎన్నికల్లో<<>> BJP బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే ప్రత్యేకంగా ₹10 లక్షలు ఇస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. కరీంనగర్ MP సీటు పరిధిలోని గ్రామాలకు అందజేస్తానన్నారు. ‘ఏకగ్రీవ పంచాయతీలకు ₹5లక్షలు ఇస్తామని BRS మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నయా పైసా నిధుల్లేవు. నిధులు ఇచ్చేది కేంద్రమే. ఈ ఎన్నికలు కేంద్ర నిధుల కోసమే. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని కోరారు.

News November 25, 2025

బీజేపీ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షలు: బండి సంజయ్

image

TG: పంచాయతీ <<18387020>>ఎన్నికల్లో<<>> BJP బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే ప్రత్యేకంగా ₹10 లక్షలు ఇస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. కరీంనగర్ MP సీటు పరిధిలోని గ్రామాలకు అందజేస్తానన్నారు. ‘ఏకగ్రీవ పంచాయతీలకు ₹5లక్షలు ఇస్తామని BRS మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నయా పైసా నిధుల్లేవు. నిధులు ఇచ్చేది కేంద్రమే. ఈ ఎన్నికలు కేంద్ర నిధుల కోసమే. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని కోరారు.