News April 5, 2024
నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం
AP: సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శుక్రవారం విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించగా.. చింతారెడ్డిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రంలోనే ఈరోజు సీఎం జగన్ ఉంటారు. శనివారం ఉదయం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. ఎల్లుండి సాయంత్రం 4గంటలకు కావలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Similar News
News October 8, 2024
అందరి చూపు ఆ ఇద్దరిపైనే.. గెలుస్తారా?
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. 90 సెగ్మెంట్లకు 1,031 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా దేశం మొత్తం ఇద్దరి ఫలితం కోసం ఎదురుచూస్తోంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఎంతో ఆదరణ పొందిన రెజ్లర్ వినేష్ ఫొగట్ జులానా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. మరొకరు భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ దీపక్ హుడా. ఈయన మెహమ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
News October 8, 2024
UAE నుంచి భారత్కు $100bns పెట్టుబడులు: పీయూష్ గోయల్
రాబోయే సంవత్సరాల్లో UAE నుంచి $100bns పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డేటా సెంటర్లు, AI, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రా రంగాల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా భూములు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో UAE ప్రత్యక్ష పెట్టుబడులు $20bnsగా ఉన్నాయి. 2023లోనే $3bns వచ్చాయి.
News October 8, 2024
రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్రావు
AP: ఆగస్టు 29న వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రేపు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు కండువాలు కప్పుకోనున్నారు. వారివెంట పెద్దఎత్తున అనుచరులు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది. 2019 డిసెంబర్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మస్తాన్రావు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరనున్నారు.