News September 29, 2024

TODAY HEADLINES

image

✒ అర్బన్ నక్సల్స్ నియంత్రణలో కాంగ్రెస్: PM
✒ ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ న‌స్రుల్లా హతం
✒ సీఎం CBNతో లులు ఛైర్మన్ భేటీ.. APలో పెట్టుబడులు
✒ ఎల్లుండి నుంచి ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు: జనసేన
✒ లడ్డూ వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా YCP పూజలు
✒ మహిళే యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు: CM రేవంత్
✒ రేవంత్ మూసీలో పేదల కన్నీళ్లు పారిస్తున్నారు: హరీశ్
✒ హైడ్రా బూచి కాదు.. భరోసా: రంగనాథ్

Similar News

News November 22, 2025

టెర్రర్ మాడ్యూల్.. మరో కీలక నిందితుడి అరెస్ట్

image

ఢిల్లీ పేలుడు-టెర్రర్ మాడ్యూల్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. పుల్వామాలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే తుఫైల్ అహ్మద్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో కీలక నిందితుడు డా.ముజఫర్ ఆగస్టులోనే దేశం విడిచి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు అఫ్గాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అరెస్టైన డాక్టర్లకు, జైషే మహ్మద్ హ్యాండర్లకు అతడే మధ్యవర్తిత్వం వహించినట్లు భావిస్తున్నారు.

News November 22, 2025

అప్పుగా తెచ్చిన ₹2.30L కోట్లు ఏమయ్యాయ్: KTR

image

TG: అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న CM క్షమాపణలు చెప్పాలని KTR డిమాండ్ చేశారు. నెలకు ₹2300 CR కూడా లేని వడ్డీని ₹7వేల కోట్లుగా అబద్ధాలు చెబుతున్నట్లు ‘కాగ్’ నివేదిక బట్టబయలు చేసిందని చెప్పారు. BRS పదేళ్లలో ₹2.8L కోట్ల రుణం తెస్తే కాంగ్రెస్ 23నెలల్లోనే ₹2.30L కోట్లు అప్పు చేసిందని దుయ్యబట్టారు. కొత్త ప్రాజెక్టులు నిర్మించలేదని, అప్పు తెచ్చిన రూ.లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

News November 22, 2025

PHOTO GALLERY: గరుడ వాహనంపై తిరుచానూరు అమ్మవారు

image

AP: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. దీనిని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీవారికి గరుడ సేవ ప్రీతిపాత్రమైనదిగా పండితులు చెబుతారు. తిరుచానూరులో ఆ సేవ జరిగే టైంలో శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి బంగారు పాదాలను పంపుతారని ప్రతీతి.