News September 30, 2024
TODAY HEADLINES

✒ స్వచ్ఛ భారత్ గాంధీకి సముచిత నివాళి: మోదీ
✒ మోదీని దించేవరకు నేను చావను: ఖర్గే
✒ నేపాల్ వరదల్లో 148 మంది మృతి..
✒ APకి 30 ESI ఆస్పత్రులు: పెమ్మసాని
✒ విశాఖలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్: లులు ఛైర్మన్
✒ దీపావళికి ఫ్రీ సిలిండర్లు.. సన్నాహాలు ప్రారంభం
✒ త్వరలో 3వేల TGSRTC ఉద్యోగాల భర్తీ: పొన్నం
✒ రేవంత్ది రాతి గుండె: హరీశ్ రావు
✒ రాజకీయాలు కాదు.. నటనే నా తొలి ఆప్షన్: ఎన్టీఆర్
Similar News
News September 17, 2025
పాకిస్థాన్ మ్యాచులకు రిఫరీగా రిచర్డ్సన్!

ఆసియా కప్: షేక్హ్యాండ్ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ని తొలగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఆసియా కప్ నుంచి తొలగించకపోతే తాము UAEతో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ మ్యాచులకు పైక్రాఫ్ట్ను ICC దూరం పెట్టినట్లు తెలుస్తోంది. UAEతో మ్యాచ్కు రిఫరీగా రిచర్డ్సన్ను నియమించినట్లు PCB సభ్యుడు చెప్పారని PTI కథనం ప్రచురించింది.
News September 17, 2025
భూమనకు తిరుపతి నేలపై నడిచే అర్హత లేదు: మంత్రి స్వామి

AP: తిరుమల విషయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి DBV స్వామి అభిప్రాయపడ్డారు. YCP నేత భూమనకు శ్రీవిష్ణువు, శని దేవుని విగ్రహానికి తేడా తెలియదా అని నిలదీశారు. ఆయనకు తిరుపతి నేలపై నడిచే అర్హత లేదని ధ్వజమెత్తారు. వేంకన్న పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలపై YCP నేతలు నిత్యం విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకన్నతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవన్నారు.
News September 17, 2025
ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య పెరిగింది. అయితే హెయిర్లాస్ ఎక్కువ ఉంటే బియ్యం కడిగిన నీళ్లతో చెక్ పెట్టొచ్చు. బియ్యం నీటితో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్ బీ, ఈ, సీలు జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. అలాగే రాత్రి బియ్యం నానబెట్టిన నీటిని వడకట్టి ఉదయాన్నే తలకు పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.