News October 11, 2024
TODAY HEADLINES

✒ రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి
✒ హరియాణా ఫలితాలపై ECకి కాంగ్రెస్ ఫిర్యాదు
✒ నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: CBN
✒ పవన్ కళ్యాణ్కు మళ్లీ అస్వస్థత
✒ CBN మాదిరి అబద్ధాలు చెప్పి ఉంటే CMగా ఉండేవాడినేమో: జగన్
✒ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి.. AP ప్రభుత్వం ఉత్తర్వులు
✒ TGవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
✒ APకి వెళ్లాల్సిందే.. TGలోని 11 మంది IASలకు కేంద్రం ఆదేశం
✒ కొండా సురేఖకు హైకోర్టు నోటీసులు
Similar News
News January 22, 2026
సీఎం రేవంత్తో మంత్రి లోకేశ్ భేటీ

దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ను శాలువాతో సత్కరించారు. ఇరు రాష్ట్రాల్లోని విద్యా సంస్కరణలు, ఐటీ అభివృద్ధి, స్కిల్ డెలవప్మెంట్పై తామిద్దరం చర్చించినట్లు లోకేశ్ తెలిపారు. కాగా దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునూ సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది.
News January 22, 2026
భోజ్శాలలో సరస్వతీ పూజ, నమాజ్కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ధార్(MP)లోని వివాదాస్పద భోజ్శాల కాంప్లెక్స్లో రేపు (జనవరి 23) వసంత పంచమి సరస్వతీ పూజ, నమాజ్ రెండూ జరుపుకొనేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది. హిందువులు రోజంతా పూజలు నిర్వహించుకోవడానికి అనుమతించింది. ఇద్దరికీ వేర్వేరు దారులు ఉండేలా చూడాలని, ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించింది.
News January 22, 2026
అక్రమ సంబంధాలు.. కుటుంబాలు నాశనం!

కొందరు మహిళలు అక్రమ సంబంధాలకు అలవాటుపడి పచ్చని కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. HYD కూకట్పల్లిలో ప్రసన్న భర్త మెడకు చున్నీ బిగించి చంపేయగా, గుంటూరు(D) చిలువూరులో భార్య లక్ష్మి భర్తను ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అటు భార్యలపై అనుమానాలతో భర్తలు వారిని చంపుతున్న ఘటనలూ పెరిగిపోయాయి. HYD రహ్మత్నగర్లో భర్త ఆంజనేయులు భార్య సరస్వతిని, అనంతపురంలో వీరాంజనేయులు తన భార్య లక్ష్మిని చంపేశారు.


