News October 23, 2024
TODAY HEADLINES

AP: విజయవాడలో డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు
☛ 15 రోజుల్లో డ్రోన్ పాలసీ: సీఎం చంద్రబాబు
☛ ఇక నుంచి వాట్సాప్లో పౌరసేవలు.. మెటాతో AP ప్రభుత్వం ఒప్పందం
TG: జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల
☛ రేపు ప్రియాంకా గాంధీ నామినేషన్.. కేరళకు CM రేవంత్
☛ పొలిటికల్ బాసులు పోలీసులకు స్వేచ్ఛనివ్వాలి: KTR
☛ దేశవ్యాప్తంగా CRPF స్కూళ్లకు బాంబు బెదిరింపులు
☛ పుతిన్తో మోదీ భేటీ.. కీలక అంశాలపై చర్చ
Similar News
News January 25, 2026
టీమ్ ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్తో మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించింది. సంజూ డకౌటైనా అభిషేక్(68*), సూర్యకుమార్(57*) ధాటిగా ఆడారు. పవర్ ప్లే ముగిసేలోపే అభిషేక్ ఫిఫ్టీ నమోదు చేశారు. ఇషాన్(28) సైతం ధనాధన్ ఇన్నింగ్సు ఆడారు. ఈ విజయంతో 5 T20Iల సిరీస్ను 3-0తో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. మరో 2 టీ20లు నామమాత్రం కానున్నాయి.
News January 25, 2026
అభిషేక్ శర్మ ఊచకోత..

న్యూజిలాండ్తో జరుగుతోన్న మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నారు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. భారత్ తరఫున టీ20లలో ఇదే సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. తొలి స్థానంలో అభిషేక్ గురువు యువరాజ్(12 బంతుల్లోనే అర్ధ సెంచరీ) ఉన్నారు.
News January 25, 2026
చెప్పింది 3 వేలు.. అసలు లెక్క 30 వేలు!

ఇరాన్ నిరసనల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. జనవరి 8, 9వ తేదీల్లోనే దాదాపు 30 వేల మంది మృతి చెందినట్లు USకు చెందిన TIME మ్యాగజైన్ వెల్లడించింది. ప్రభుత్వం ప్రకటించిన 3,117 మరణాల కంటే హాస్పిటల్ రికార్డులు, స్థానిక అధికారులు, వైద్యులు తెలిపిన సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. సుమారు 4,000 ప్రాంతాల్లో నిరసనలు జరగగా ఇంటర్నెట్ ఆపేయడం వలన వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియలేదని పేర్కొంది.


