News October 30, 2024
TODAY HEADLINES

✭70 ఏళ్లు దాటిన వారు ఆయుష్మాన్ కార్డు తీసుకోవాలి: PM మోదీ
✭TG: ఏడాదిలో కేసీఆర్ అనే పదం కనిపించదు: CM రేవంత్
✭నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులు ప్రారంభం: CM
✭AP: గవర్నర్తో సీఎం చంద్రబాబు భేటీ
✭ఆస్తుల పంపకం అవాస్తవం: విజయమ్మ
✭ఫ్యామిలీ విలన్ జగన్.. జస్టిస్ ఫర్ విజయమ్మ: TDP
✭విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు: మంత్రి గొట్టిపాటి
✭TG: కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి: KTR
Similar News
News January 14, 2026
ఇంటర్ ఫస్టియర్లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్!

ఇంటర్ పూర్తయ్యాక నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ను ఫస్టియర్/11వ తరగతిలోనే జరిపే ప్రతిపాదనపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ కసరత్తు చేస్తోంది. విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తగ్గించడం, కోచింగ్ సెంటర్ల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు ఈ దిశగా ఆలోచిస్తోంది. అలాగే ఇంటర్ పరీక్షలను మల్టిపుల్ ఛాయిస్ తరహా విధానంలో నిర్వహించడం, బోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇవ్వడంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
News January 14, 2026
రేపు, ఎల్లుండి విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్స్

విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్, విదర్భ, కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి. నిన్నటి క్వార్టర్ఫైనల్లో పంజాబ్ 183 పరుగుల తేడాతో MPపై ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్లో విదర్భ 76 పరుగులతో ఢిల్లీని ఓడించింది. దీంతో రేపు జరిగే సెమీఫైనల్లో విదర్భ-కర్ణాటక తలపడనుండగా, ఎల్లుండి పంజాబ్-సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్లలో విజయం సాధించిన టీమ్లు 18న ఫైనల్లో తలపడనున్నాయి.
News January 14, 2026
నిష్క్రమిస్తోన్న ఈశాన్య రుతుపవనాలు

AP: ఈశాన్య రుతుపవనాలు 3 రోజుల్లో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి నిష్క్రమించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గాలుల దిశలో మార్పుతో క్రమంగా వైదొలుగుతాయని పేర్కొంది. మరోవైపు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీల్లో మంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


