News November 22, 2024

TODAY HEADLINES

image

✒ లంచం ఆరోపణలు.. అదానీపై USలో కేసు
✒ అదానీని అరెస్ట్ చేస్తే మోదీ పేరు బయటికి: రాహుల్
✒ AP: భూమిని ఆక్రమిస్తే బయట తిరగలేరు: CBN
✒ AP: స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటాం: పవన్
✒ APలో NTCP రూ.1.87L cr పెట్టుబడులు
✒ TG: మండలానికి 2 అంబులెన్సులు: మంత్రి రాజనర్సింహ
✒ TG: DEC 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
✒ TG: లగచర్ల కేసు: CS, DGPకి NHRC నోటీసులు
✒ TG: 29న రాష్ట్రవ్యాప్తంగా BRS దీక్షా దివస్: KTR

Similar News

News January 14, 2026

ఆర్థిక సంఘం నిధులు వచ్చేస్తున్నాయ్!

image

TG: సుమారు రెండేళ్లుగా పాలకవర్గాలు లేక అభివృద్ధి నిలిచిపోయిన గ్రామపంచాయతీలకు మహర్దశ పట్టనుంది. ఇటీవల కొత్త పాలకవర్గాలు ఏర్పడగా జీపీలకు త్వరలో 15వ ఆర్థిక సంఘం నిధులు రానున్నాయి. రాష్ట్రానికి రూ.2,500Cr పెండింగ్‌ ఉండగా ఈ నెలాఖరు నాటికి రూ.1000Cr, వచ్చేనెల రూ.1500Cr కేంద్రం రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ప్రతి జీపీకి ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్ పవర్‌తో నిధులను వినియోగిస్తారు.

News January 14, 2026

ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>రాయ్‌పుర్‌<<>>లోని ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 150 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టులను బట్టి టెన్త్+NTC/నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన వారు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 18 -32ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: ddpdoo.gov.in/

News January 14, 2026

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,014 మంది దర్శించుకోగా.. 19,639 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.