News November 26, 2024

TODAY HEADLINES

image

✎ ప్రతిపక్షాలను ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నారు: మోదీ
✎ అదానీ రూ.100 కోట్లు తెలంగాణకు వద్దు: CM రేవంత్
✎ జగన్-అదానీ ఒప్పందాన్ని రద్దు చేయాలని CBNకు షర్మిల లేఖ
✎ లగచర్లకు వెళ్లుంటే రేవంత్‌ను ఉరికించి కొట్టేవాళ్లు: KTR
✎ ఈనెల 30నే పింఛన్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
✎ పుష్ప-2ను ఆపడం ఎవరితరం కాదు: అంబటి
✎ ముగిసిన IPL-2025 మెగా వేలం
✎ BGT: తొలి టెస్టులో భారత్ 295 రన్స్ తేడాతో విజయం

Similar News

News December 1, 2025

జగిత్యాల: రూ.28 లక్షల విలువైన 136 మొబైల్స్ రికవరీ

image

పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్‌ ద్వారా సులభంగా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ.28 లక్షల విలువగల 136 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. CEIR‌లో IMEI వివరాలు నమోదు చేస్తే ఫోన్లను త్వరగా ట్రేస్ చేయవచ్చని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.3.5 కోట్ల విలువగల 1548 ఫోన్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు.

News December 1, 2025

ఇకపై అన్ని ఫోన్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయలేం!

image

దేశంలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలిచ్చినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఇకపై తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్‌ ‘సంచార్ సాథీ’ని డిఫాల్ట్‌గా ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ యాప్‌ను డిలీట్ చేయలేరు. ఇందుకు 90 రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ అంశంపై అటు ప్రభుత్వం, ఇటు మొబైల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు.

News December 1, 2025

‘చిన్నస్వామి’ సేఫ్టీ క్లియరెన్స్ కోరిన ప్రభుత్వం

image

RCB ర్యాలీలో తొక్కిసలాట నేపథ్యంలో వచ్చే IPLకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగడంపై సందిగ్ధత నెలకొంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు ఇచ్చింది. స్టేడియం సేఫ్టీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ నివేదిక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నుంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో ప్రిపేర్ చేయించాలని ఆదేశించింది.