News December 27, 2024
TODAY HEADLINES

* మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
* ఏపీలో ఈ నెల 31న పింఛన్ల పంపిణీ
* పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా?: సీఎం రేవంత్
* మస్కట్ బాధితురాలికి అండగా నారా లోకేశ్
* తెలంగాణ విద్యార్థులకు 11 రోజులు సెలవులు
* మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య?
* మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్: రాహుల్ గాంధీ
* ప్రముఖ రచయిత, డైరెక్టర్ వాసుదేవన్ కన్నుమూత
* రూ.1,700 కోట్లు దాటిన ‘పుష్ప 2’ కలెక్షన్లు
Similar News
News September 17, 2025
మావోయిస్టుల సంచలన ప్రకటన.. ఆయుధాలు వదిలేస్తామని లేఖ

తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేసి, ఎన్కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. CPI మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ స్టేట్మెంట్ రిలీజైంది. కాగా అమిత్ షా 2026 మార్చి లోపు భారత గడ్డపై మావోయిస్టులను ఉండనివ్వబోమని డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. ఇది భద్రతా బలగాలకు అతిపెద్ద విజయం అని విశ్లేషకులు చెబుతున్నారు.
News September 16, 2025
దేశానికి సంక్షేమం పరిచయం చేసింది NTR: చంద్రబాబు

AP: దేశ రాజకీయాల్లో NTR ఒక సంచలనం అని CM చంద్రబాబు కొనియాడారు. విజయవాడలో సజీవ చరిత్ర-1984 అనే పుస్తకావిష్కరణలో సీఎం పాల్గొన్నారు. దేశానికి సంక్షేమం పరిచయం చేసింది NTR అని, ఆయన స్ఫూర్తితో స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తామని CBN తెలిపారు. అమరావతిలో తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 1984లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందన్నారు.
News September 16, 2025
వాహనమిత్ర అప్లికేషన్ ఫామ్ ఇదే.. రేపటి నుంచి దరఖాస్తులు

AP: వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో/క్యాబ్ డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి <<17704079>>అప్లై చేసుకోవాలని<<>> ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ఫామ్ రిలీజ్ చేసింది. అందులో వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలని పేర్కొంది. ఎంపికైన డ్రైవర్లకు అక్టోబర్లో రూ.15వేల చొప్పున నగదు జమ చేయనుంది.