News January 18, 2025

TODAY HEADLINES

image

✒ FEB 1న కేంద్ర బడ్జెట్.. 2 విడతలుగా సమావేశాలు
✒ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ₹11,440Cr ప్యాకేజీ
✒ AP: తనతో భేటీకి MPల గైర్హాజరు.. CBN ఆగ్రహం
✒ AP: పేదలకు పట్టణాల్లో 2సెంట్లు, గ్రామాల్లో 3సెంట్లు
✒ IPS సునీల్‌కుమార్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశం
✒ సింగపూర్ మినిస్టర్‌తో CM రేవంత్ భేటీ.. పెట్టుబడులపై చర్చ
✒ 100% రుణమాఫీ నిరూపిస్తే రాజీనామా: KTR
✒ పాత రేషన్ కార్డులు తొలగించం: మంత్రి పొన్నం

Similar News

News February 12, 2026

బడ్జెట్ సమావేశాలు.. వ్యూహాలపై వైసీపీ చర్చ

image

AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ వైసీపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనుంది. మ.3 గంటలకు తాడేపల్లిలో పార్టీ చీఫ్ జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. నిన్న అసెంబ్లీకి వెళ్లిన జగన్ అన్ని రోజులూ హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

News February 12, 2026

నమీబియాతో మ్యాచ్.. ప్రయోగాలు చేస్తారా?

image

USAపై గెలిచిన టీమ్ ఇండియా ఇవాళ T20 WCలో రెండో మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 7pmకు మొదలయ్యే మ్యాచులో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కోచ్ గంభీర్ సానూకూలంగా ఉండటంతో శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. బుమ్రాకు రెస్ట్ కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు అభిషేక్ ఫిట్‌నెస్‌పై ఇంకా క్లారిటీ లేకపోగా టీమ్11లో ఉంటాడా అనేది అనుమానమే.

News February 12, 2026

బ్రిటీష్ అధికారికి స్వామివారి దర్శనం

image

బ్రిటీష్ కాలంలో సర్ థామస్ మన్రో అనే అధికారి మంత్రాలయ మఠం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భావించారు. అయితే, ఆశ్చర్యకరంగా రాఘవేంద్ర స్వామి బృందావనం నుంచి బయటకు వచ్చి మన్రోకు దర్శనమిచ్చారు. ఆయనతో చర్చించి భూములను స్వాధీనం చేసుకోకుండా ఒప్పించారు. ఈ సంభాషణ గురించి మన్రో స్వయంగా ‘మద్రాస్ గెజిట్’లో నమోదు చేయడం విశేషం. ఓ పరాయి దేశస్థుడికి కూడా దర్శనమిచ్చిన స్వామివారి కరుణా సాగరం అనంతమైనది.