News February 5, 2025
TODAY HEADLINES
*కులగణనతో బీసీ జనాభా పెరిగింది: సీఎం రేవంత్
*సమగ్ర కుటుంబసర్వే ఎందుకు దాచిపెట్టారు?: రేవంత్
*వ్యాపారులను వేధించొద్దు: సీఎం CBN సూచన
*పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలకు నోటీసులు
*ఏపీలో AI సెంటర్ నెలకొల్పండి: లోకేశ్
*బీసీ రిజర్వేషన్లపై చట్టం తేవాలి: కేటీఆర్
*రూ.400 LED బల్బును రూ.40కి తగ్గించాం: PM
*‘తండేల్’ టికెట్ల ధరల పెంపునకు అనుమతి
*శ్రీలంక క్రికెటర్ దిముత్ కరుణరత్నే రిటైర్మెంట్
Similar News
News February 5, 2025
ప్రణబ్ మెమోరియల్ పక్కనే మన్మోహన్ స్మారకానికి స్థలం?
మాజీ PM, దివంగత మన్మోహన్ సింగ్ మెమోరియల్ కోసం కేంద్రం ఢిల్లీలో స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్ ఘాట్ కాంప్లెక్స్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకం పక్కనే ల్యాండ్ను ఇస్తామని మన్మోహన్ కుటుంబీకులకు తెలిపినట్లు సమాచారం. వారు సమ్మతి తెలపగానే మెమోరియల్ నిర్మాణానికి రూ.25 లక్షలు అందించనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది DEC 26న మన్మోహన్ మరణించిన విషయం తెలిసిందే.
News February 5, 2025
SSMB29: ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదా.. విలనా?
సూపర్స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఆమె విలన్ క్యారెక్టర్లో కనిపిస్తారని టాక్. కాగా ఈ మూవీ కోసం కాశీలో ఉండే మణికర్ణికా ఘాట్ తరహాలో హైదరాబాద్లో సెట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News February 5, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణమ్ము మగువ సిద్ధము సుమతీ!
తాత్పర్యం: ఈ లోకంలో పట్టణానికి వ్యాపారి, వరి పొలానికి నీరు, ఏనుగుకు తొండము, సంపదకు స్త్రీ ప్రాణాధారము. అవి లేకపోతే జీవం ఉండదు.