News February 21, 2025

TODAY HEADLINES

image

* మిర్చి రైతులను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
* ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు
* నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్
* కేసీఆర్, జగన్ స్నేహం వల్లే ఏపీ జల దోపిడీ: మంత్రి ఉత్తమ్
* అక్రమ కేసులకు భయపడేది లేదు: YS జగన్
* యథాతథంగా గ్రూప్-2 పరీక్షలు: APPSC
* ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం
* ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
* బంగ్లాదేశ్‌పై భారత్ సూపర్ విక్టరీ

Similar News

News January 12, 2026

అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు నోటీసులు 1/2

image

TG: రాష్ట్రంలో 2వేల ఏజెన్సీల పరిధిలో 4L మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి ఆధార్, వేతన వివరాలను EX CS శాంతికుమారి కమిటీ సేకరించింది. అయితే ఏజెన్సీలు EPF, ESIలకు నిధులు జమచేయడం లేదని గుర్తించింది. ఆ అకౌంట్ల వివరాలివ్వాలని, లేకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని తాజాగా నోటీసులిచ్చింది. ఇవి అందితే వాటి అవినీతి బాగోతం బయటపడనుంది. దీంతో ఏజెన్సీలు అకౌంట్లు తెరిచే పనిలో పడ్డాయి.

News January 12, 2026

అవుట్ సోర్సింగ్ పేరిట 12 ఏళ్లుగా నిధులు స్వాహా 2/2

image

TG: ఖాళీలు భర్తీకాని తరుణంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సిబ్బందిని GOVT నియమించుకుంటుంది. ఇందుకు ఏజెన్సీలకు 20% కమీషన్ 12 ఏళ్లుగా అందిస్తోంది. ఇవన్నీ గతంలో BRS నేతల బినామీల పేరిట ఏర్పాటైనవిగా తెలుస్తోంది. ఆధార్ లింక్ లేకపోవడంతో బోగస్ పేర్లతో నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. GOVT, ఉద్యోగి వాటా EPF, ESI నిధులనూ మింగేశాయి. ఇలా భారీగా దోచుకున్న సంస్థలపై ప్రభుత్వం నివేదికను రెడీ చేసింది.

News January 12, 2026

కొనసాగుతున్న రూపాయి పతనం

image

ఈ వారం మార్కెట్‌ను రూపాయి నష్టాలతో ప్రారంభించింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 5 పైసలు పతనమయ్యి రూ.90.23 వద్ద కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలు ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. శుక్రవారం 28 పైసలు పతనమయ్యి రూ.90.18 వద్ద ముగియగా ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతోంది. జియో పాలిటిక్స్, అమెరికా టారిఫ్స్ భయం కూడా దీనికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.