News February 23, 2025
TODAY HEADLINES

* APలో రేపటి గ్రూప్-2 పరీక్షలు యథాతథం
* CM రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్
* మిర్చి రైతులతో CM చంద్రబాబు కీలక భేటీ
* దేశంలో ఏ CM చేయని సాహసం చేస్తున్నా: రేవంత్
* అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం
* SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు
* టెస్లాకు AP భారీ ఆఫర్.. లోకేశ్ ప్రత్యేక చొరవ!
* ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్పై ఆసీస్ విజయం
Similar News
News December 4, 2025
మార్గశిర గురువారం.. ఎందుకంత ప్రత్యేకం?

హిందూ సంప్రదాయంలో శ్రావణం, మాఘం, కార్తీకం, మార్గశిరం వంటి కొన్ని పవిత్ర మాసాలున్నాయి. ఈ మాసాల్లో కొన్ని వారాలు దైవారాధనకు అత్యంత విశిష్టమైనవిగా చెబుతారు. అలాగే మార్గశిర గురువారాన్ని శుభదినంగా భావిస్తారు. ఈరోజున కనక మహాలక్ష్మిని పూజిస్తే.. సిరిసంపదలకు లోటుండదని నమ్ముతారు. ఈ ఏడాది ఈ మార్గశిర గురువారం పౌర్ణమి కలయికతో వచ్చింది. అందుకే ఈ రోజును అతి పవిత్రమైన, శ్రేష్ఠమైన రోజుగా పండితులు చెబుతున్నారు.
News December 4, 2025
మోదీ, పుతిన్ చర్చించే అంశాలు ఇవే..

భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు <<18463791>>పుతిన్<<>> పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వాణిజ్యం, డిఫెన్స్ కోఆపరేషన్, ఆయిల్, న్యూక్లియర్ ఎనర్జీ, వర్కర్లపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైళ్లను నేలమట్టం చేసింది. వాటితో పాటు S-500లు, బ్రహ్మోస్ మిస్సైళ్లు, Su-57 ఫైటర్ జెట్ల కొనుగోళ్లపై ఒప్పందాలు జరగనున్నాయి.
News December 4, 2025
తొలి విడత.. ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్!

TG: రాష్ట్రంలో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థులకు తెలుగు అక్షర క్రమం ఆధారంగా EC గుర్తులు కేటాయించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి 30 మంది సర్పంచ్లు ఏకగ్రీవమైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. మొత్తంగా 400కుపైగా స్థానాలు ఏకగ్రీవమవుతాయని అంచనా వేశాయి. రెండో విడతలో 4,332 సర్పంచ్ స్థానాలకు 28,278 మంది, 38,342 వార్డు స్థానాలకు 93,595 మంది నామినేషన్లు వేసినట్లు సమాచారం.


