News April 7, 2025
TODAY HEADLINES

✒ తమిళనాట పాంబన్ బ్రిడ్జిని ప్రారంభించిన PM
✒ CPM ప్రధాన కార్యదర్శిగా MA బేబీ
✒ భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం
✒ ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. కేంద్రానికి CBN లేఖ
✒ వృద్ధి రేటులో APకి రెండో స్థానం: CM
✒ గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు: సంధ్యారాణి
✒ రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన రేవంత్
✒ HCU రక్షణకు చేతులు కలపండి: KTR
✒ మంత్రులను AICC నిర్ణయించడమేంటి?: సంజయ్
Similar News
News April 9, 2025
బ్రిటన్ యువరాజు ప్రాణాలకు ముప్పు: లాయర్

బ్రిటన్ యువరాజు హ్యారీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన తరఫు న్యాయవాది ఫాతిమా లండన్ కోర్టుకు తెలిపారు. హ్యారీ తన భార్యతో కలిసి 2020లో అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. ఆయన బ్రిటన్ వచ్చినప్పుడు కల్పించే భద్రతను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఈ నేపథ్యంలోనే హ్యారీ కోర్టును ఆశ్రయించారు. ‘హ్యారీని చంపాలంటూ ఆల్ ఖైదా ఈమధ్యే పిలుపునిచ్చింది. ఇక ఆయన్ను, ఆయన భార్యను మీడియా డేగలా వెంటాడుతోంది’ అని ఫాతిమా వివరించారు.
News April 9, 2025
‘ఓజీ’లో అకీరా నందన్.. రేణూ దేశాయ్ స్పందనిదే

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీలో అకీరా నందన్ నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై నటి రేణూ దేశాయ్ ఓ పాడ్ కాస్ట్లో స్పందించారు. ‘అకీరా ప్రస్తుతం ఏ మూవీలోనూ నటించడం లేదు. ఆయన తండ్రి పవన్ నటిస్తున్న ‘ఓజీ’లోనూ ఆయన లేరు. ఒకవేళ అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే నేనే సోషల్ మీడియాలో ప్రకటిస్తా. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వార్తలన్నీ నిరాధారం’ అని ఆమె స్పష్టం చేశారు.
News April 9, 2025
చైనాకు ట్రంప్ భారీ షాక్.. చెప్పినట్లే భారీ సుంకాలు

చైనా తమపై విధించిన ప్రతీకార సుంకాల విషయంలో వెనక్కి తగ్గకపోతే ఆ దేశంపై టారిఫ్స్ను 104శాతానికి పెంచుతానన్న ట్రంప్, అదే చేశారు. తన హెచ్చరికల్ని లైట్ తీసుకున్న చైనాపై అదనంగా 50శాతం సుంకాలు విధించారు. దీంతో ఆ దేశంపై అమెరికా మొత్తం టారిఫ్లు 104శాతానికి చేరాయి. దీనిపై చైనా స్పందించాల్సి ఉంది. ఈ వాణిజ్య యుద్ధం ఎక్కడకు దారి తీస్తుందోనని ఆర్థిక వేత్తల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.