News May 7, 2025
TODAY HEADLINES

* TDPతోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు: చంద్రబాబు
* ప్రజల ఆకాంక్షలు తీర్చడమే మా లక్ష్యం: రేవంత్ రెడ్డి
* భారీ ఎన్కౌంటర్.. 37 మంది మృతి?
* భారత్లో భారీగా తగ్గిన పేదరికం: ప్రపంచ బ్యాంకు
* పాతతరం రాజకీయాలు అంతరించాయి: రాహుల్
* నేను భారత కోడలిని.. నన్ను పంపించకండి: సీమా హైదర్
* SLBC టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు తాత్కాలిక బ్రేక్!
* మే 7న ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్
Similar News
News August 13, 2025
పులివెందుల: కొనసాగుతున్న రీపోలింగ్

AP: పులివెందులలో ZPTC ఉప ఎన్నిక రీపోలింగ్ కొనసాగుతోంది. అచ్చవెల్లిలోని 3వ, కొత్తపల్లెలోని 14వ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు మరోసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. నిన్న పలు ఉద్రిక్త పరిస్థితులు జరిగిన నేపథ్యంలో ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. అటు నిన్న సా.5గంటల వరకు పులివెందులలో 76.44శాతం, ఒంటిమిట్టలో 81.53శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.
News August 13, 2025
అత్యవసరమైతేనే బయటకు రండి: హైడ్రా

TG: హైడ్రా పరిధిలో నేటినుంచి మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. మేడ్చల్, సైబరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ఆగస్టు 13, 14, 15 తేదీల్లో వాహనాల వాడకం తగ్గించాలని, సాధ్యమైనంత వరకు బయటకు రావొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. హెల్ప్లైన్ నంబర్లు: 040 29560521, 9000113667, 9154170992.
News August 13, 2025
నేడు ED విచారణకు మంచు లక్ష్మి

TG: సినీ నటి మంచు లక్ష్మి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మంచు లక్ష్మికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నగదు లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఆమెను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాను అధికారులు విచారించిన విషయం తెలిసిందే.