News August 12, 2025
TODAY HEADLINES

* భారత్ ఎవరికీ తలవంచదు: సీఎం చంద్రబాబు
* AP DSC ఫలితాలు విడుదల
* తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
* షూటింగ్లు బంద్ చేయడం సరికాదు: కోమటిరెడ్డి
* కాంగ్రెస్ చేతకానితనంతో ఎకానమీ పతనమవుతోంది: KTR
* పులివెందులలో టీడీపీ రిగ్గింగ్ కుట్రలు: అవినాశ్
* హీరో రానాను విచారించిన ఈడీ
* తగ్గిన బంగారం ధరలు
* ‘మాస్ జాతర’ టీజర్ విడుదల
Similar News
News August 12, 2025
ఇన్కమ్ టాక్స్ బిల్లు-2025లో ఏం మారాయి?

ఇవాళ ఆమోదం <<17375107>>పొందిన<<>> ఇన్కమ్ టాక్స్ బిల్లు-2025లో కొన్ని పదాలను మార్చారు. పాత బిల్లులో ‘క్రితం సంవత్సరం, అసెస్మెంట్ ఇయర్’ అనే పదాల స్థానంలో ‘టాక్స్ ఇయర్’ అని రీప్లేస్ చేశారు. కొత్త పన్నులు, శ్లాబులు, ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, రేట్లనేమీ మార్చలేదు. స్టాండర్డ్ డిడక్షన్, గ్రాడ్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ తదితర సెక్షన్లు, నిబంధనలను ఒక పట్టిక రూపంలోకి తీసుకొచ్చారు. బిల్లు కోసం ఇక్కడ <
News August 12, 2025
APLలో ఇవాళ్టి మ్యాచులు ఇవే

AP: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్4 సక్సెస్ఫుల్గా సాగుతోంది. నిన్న మొదటి మ్యాచ్లో తుంగభద్ర వారియర్స్పై అమరావతి రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్లో సింహాద్రి వైజాగ్ లైన్స్పై కాకినాడ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గం.కు భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సా.6.30గం.కు విజయవాడ సన్ షైనర్స్, సింహాద్రి వైజాగ్ లైన్స్ తలపడనున్నాయి.
News August 12, 2025
భారత్ సరిహద్దు సమీపంలో చైనా రైల్వే లైన్!

ఇండియా సరిహద్దు సమీపంలో చైనా రైల్వేలైన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో కొంత భాగం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(LAC) సమీపంలో ఉంటుందని చెప్తున్నారు. టిబెట్ను షిన్జాంగ్ ప్రావిన్సుతో కలపనున్నారు. రూ.1.15 లక్షల కోట్ల క్యాపిటల్తో ‘ది షిన్జాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని రిజిస్టర్ చేశారని చైనా మీడియాలో వార్తలొచ్చాయి. LAC సమీపంలో కాబట్టి రక్షణపరంగా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరముంది.