News April 22, 2024
TODAY HEADLINES

AP: 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు
AP: 9 మంది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
AP: జగన్లా నాపై 32 కేసులు లేవు: పవన్ కళ్యాణ్
AP: బాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లుంది: సజ్జల
TS: నాతో పాటు కోమటిరెడ్డికే సీఎం అర్హత: రేవంత్
TS: వచ్చే ఐదేళ్లలో పేదలకు 3 కోట్ల ఇళ్లు: కిషన్ రెడ్డి
TS: ఈనెల 24న ఇంటర్ ఫలితాలు
TS: త్వరలో 25 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి: ఉత్తమ్
IPL: RCBపై KKR, PBKSపై GT విజయం
Similar News
News March 10, 2026
12pm-4pm పనులు రీషెడ్యూల్ చేసుకోండి: అనిత

AP: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. 12pm-4pm మధ్య బహిరంగ ప్రదేశాల్లో పనులుంటే రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. APSDMA, RTGS నుంచి ఎప్పటికప్పుడు వడగాల్పుల హెచ్చరికలు చేరవేయాలని ఆ విభాగాల అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు. వడదెబ్బ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.
News March 10, 2026
చమురు ధరలకు మళ్లీ రెక్కలు?

ఇప్పుడిప్పుడే తగ్గుతున్న <<19341758>>క్రూడ్<<>> ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. 10%కుపైగా తగ్గిన US క్రూడ్ ఇప్పుడు కోలుకొని -4% వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ ధరల తగ్గుదల కూడా తటస్థంగా ఉంది. దీంతో చమురు ధరలు మళ్లీ పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. ఇరాన్పై ఎప్పుడూ లేని రేంజ్లో భీకర దాడులు చేస్తామని <<19348669>>US<<>> చెప్పడం, డ్రోన్ దాడికి UAEలోనే అతిపెద్దదైన అబుదాబి ఆయిల్ రిఫైనరీ మూతపడటం కారణాలుగా తెలుస్తోంది.
News March 10, 2026
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేకాధికారులు

AP: రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల వరకు లేదా కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు వీరి పాలన సాగనుంది. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు కార్పొరేషన్లు సహా ఇతర సంస్థలకు RDO, JCలను ప్రత్యేక అధికారులుగా నియమించింది.


