News October 13, 2025
TODAY HEADLINES

☛ ‘AP ఎక్సైజ్ సురక్షా యాప్’ను రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు
☛ విశాఖ అభివృద్ధికి 10 ఏళ్లు చాలు: మంత్రి లోకేశ్
☛ SRSP-2కి దామోదర్ రెడ్డి పేరు: CM రేవంత్
☛ TG బంద్ వాయిదా: BC JAC
☛ ‘స్థానిక’ ఎన్నికలు: రేపు సుప్రీంకోర్టుకు TG సర్కార్
☛ బిహార్లో NDA సీట్ల షేరింగ్ ఖరారు.. BJPకి 101 సీట్లు
☛ ఉమెన్స్ WC: భారత్ పై ఆస్ట్రేలియా విజయం
☛ అఫ్గాన్ దాడులు.. 15 మంది పాక్ సైనికులు హతం
Similar News
News October 13, 2025
పాక్-అఫ్గాన్ మధ్య ఇరాన్ మధ్యవర్తిత్వం

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు ముస్లిం దేశాలు ముందుకొచ్చాయి. ఇరు దేశాలు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్ దేశాలు తెలిపాయి. ఇరాన్ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి కాల్పులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. కాబుల్లో పాక్ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలోనే ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి.
News October 13, 2025
వేణు ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ నుంచి నితిన్ ఔట్?

బలగం మూవీతో డైరెక్టర్గా బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు తర్వాత ‘ఎల్లమ్మ’ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఇంకా హీరో ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మొదట నితిన్ పేరు వినిపించింది. నిర్మాత దిల్ రాజు కూడా ఆ విషయాన్ని కన్ఫామ్ చేశారు. కానీ, ఇప్పుడు నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ కథను బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు వినిపించగా ఓకే చేశారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
News October 13, 2025
చైనాను బాధ పెట్టాలి అనుకోవట్లేదు: ట్రంప్

చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనంగా 100% టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే. అయితే తాను చైనాను బాధ పెట్టాలి అనుకోవట్లేదని పేర్కొన్నారు. ‘చైనా గురించి ఆందోళన వద్దు ఆ దేశం బాగానే ఉంటుంది. అధ్యక్షుడు జిన్పింగ్ కాస్త గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన గానీ, నేను గానీ చైనాకు ఇబ్బందులు రావాలి అనుకోవట్లేదు. US చైనాకు సాయం చేయాలనుకుంటోది. దానిని బాధించాలని కాదు’ అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.