News November 4, 2025
TODAY HEADLINES

* చేవెళ్లలో RTC బస్సును టిప్పర్ ఢీకొని 19 మంది మృతి.. రూ.7 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
* ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM రేవంత్
* లండన్లో CM CBNతో హిందూజా గ్రూప్ ప్రతినిధుల భేటీ.. రూ.20వేల కోట్ల పెట్టుబడులకు ఓకే
* CII సమ్మిట్లో రూ.9.8 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు.. 7.5 లక్షల ఉద్యోగావకాశాలు: మంత్రి లోకేశ్
* WWC: ప్లేయర్లకు డైమండ్ నెక్లెస్ల బహుమతి
Similar News
News November 4, 2025
DRDOలో 105 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (LRDE)లో 105 అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైనవారు అప్లై చేసుకోవచ్చు. ముందుగా apprenticeshipindia.gov.in పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. గేట్ స్కోరు, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.drdo.gov.in/
News November 4, 2025
చల్లని vs వేడి నీళ్లు.. పొద్దున్నే ఏవి తాగాలి?

ఉదయాన్నే ఓ గ్లాసు నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘గోరువెచ్చటి నీటికి జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. డిటాక్సిఫికేషన్, రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఓ గ్లాసు చల్లటి నీళ్లు తాగితే క్యాలరీలు బర్న్ అవుతాయి. రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలుగుతుంది. చల్లటి నీటికి శరీరం వేగంగా హైడ్రేట్ అవుతుంది’ అని చెబుతున్నారు. మీ అవసరాలను బట్టి గోరువెచ్చటి లేదా చల్లటి నీరు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
News November 4, 2025
వయ్యారిభామను కట్టడి చేసే కలుపు మందులు

వయ్యారిభామ నిర్మూలనకు పంట మొలకెత్తక ముందు అట్రాజిన్ రసాయన మందును లీటర్ నీటికి నాలుగు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు.. లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. బంజరు భూముల్లో లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ మందు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించవచ్చు. కలుపు నివారణ మందులను పిచికారీ చేసేటప్పుడు పక్క పంటలపై పడకుండా జాగ్రత్తపడాలి.


