News March 8, 2026

TODAY HEADLINES

image

* వంట గ్యాస్‌‌ ₹60, కమర్షియల్ గ్యాస్‌పై ₹115 పెంపు
* రాష్ట్రపతి WB పర్యటనలో ప్రొటోకాల్ వివాదం.. PM ఫైర్
* AP: క్వాంటం వ్యాలీతో అనేక మార్పులు: CBN
* AP: లస్కర్ల జీతం రూ.6వేలు పెంపు
* AP: ఇథిలీన్ గ్లైకాల్ కలవడంతోనే పాల కల్తీ
* TG: గద్దర్ అవార్డులు: ఉత్తమ నటి- రష్మిక
* TG: ఒకేసారి 130 మంది మావోల లొంగుబాటు
* TG: ఈనెల 31లోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి

Similar News

News March 8, 2026

ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు లేదు: SPDCL CMD

image

TG: ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు ఉండదని SPDCL CMD జితేశ్.వి.పాటిల్ స్పష్టం చేశారు. SPDCL పరిధిలో మొత్తం 1.20 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని, గతేడాదితో పోలిస్తే 12.09L మంది పెరిగారని వెల్లడించారు. ‘గృహాజ్యోతి’ పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గిందన్నారు. ఈ ఏడాది FEB వరకు 5.44కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా, ప్రభుత్వం నుంచి రూ.1930.66కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చాయని తెలిపారు.

News March 8, 2026

యుద్ధంలోకి వస్తామన్న UK? అవసరం లేదన్న ట్రంప్!

image

మిడిల్ ఈస్ట్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపాలని UK అనుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ‘ఒకప్పుడు మన గొప్ప మిత్ర దేశమైన UK ఎట్టకేలకు మిడిల్ ఈస్ట్‌కు రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపించాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. కానీ మాకు అవి అవసరం లేదు PM స్టార్మర్. మేం ఆల్రెడీ యుద్ధం గెలిచాం. ఇప్పుడు యుద్ధంలో చేరేవారు మాకు అవసరం లేదు’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.

News March 8, 2026

7 రోజుల్లో గల్ఫ్ నుంచి భారత్‌కు 52వేల మంది

image

ప.ఆసియా, గల్ఫ్‌లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఎయిర్ స్పేస్ పాక్షికంగా తెరుచుకోవడంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు కమర్షియల్ ఫ్లైట్స్ నడుపుతున్నాయని, MAR 1 నుంచి 7వ తేదీ మధ్య 52వేల మంది గల్ఫ్ నుంచి INDకి తిరిగొచ్చారని వెల్లడించింది. ఫ్లైట్స్ అందుబాటులో లేని దేశాల్లో ఉన్నవారు ఇన్ఫర్మేషన్ కోసం ఎంబసీ/కన్సులేట్‌ను సంప్రదించాలంది. హెల్ప్ లైన్ <>నంబర్లు<<>> షేర్ చేసింది.