News May 24, 2024
TODAY HEADLINES

* AP: మాచర్ల ఎమ్మెల్యే PRKకు ఊరటనిచ్చిన హైకోర్టు
* రిగ్గింగ్ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు: అనిల్ కుమార్
* చంద్రబాబు వద్ద కొత్త ప్యాకేజీ స్టార్ ప్రశాంత్ కిషోర్: వైసీపీ
* TG: మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి: కేటీఆర్
* సీఎంకు రైతుల కంటే ఎన్నికలే ముఖ్యం: కిషన్ రెడ్డి
* జూన్ 4 తర్వాత వైసీపీ దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
* ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Similar News
News February 14, 2026
కొత్తగూడెంపై కమ్యూనిస్ట్ జెండా.. CPIకి కాంగ్రెస్ మద్దతు!

TG: హంగ్ ఏర్పడ్డ కొత్తగూడెం కార్పొరేషన్పై అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీపీఐకి మద్దతు తెలుపుతూ మేయర్ పీఠం ఆఫర్ చేసినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ పదవి తమకు ఇవ్వాలని కమ్యూనిస్ట్ నేతలతో సీఎం రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్పై కమ్యూనిస్ట్ జెండా ఎగరనుంది. అటు ఇప్పటికే తామూ CPIకి మద్దతు ఇస్తామని BRS ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.
News February 14, 2026
18 బంతుల్లోనే 50 రన్స్..

T20WCలో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో సౌతాఫ్రికా రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా(3 ఓవర్లు) 50 పరుగులు చేసిన రెండో టీమ్గా నిలిచింది. మార్క్రమ్ 14 బంతుల్లో 41, డికాక్ 4 బంతుల్లో 9 రన్స్ కొట్టారు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 2016లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ 2.5 ఓవర్లలోనే 50 బాదింది. కాగా ఇవాళ్టి మ్యాచ్లో SA పవర్ ప్లే ముగిసే సమయానికి 83/1 స్కోర్ చేసింది.
News February 14, 2026
40 కంపెనీల సీఈవోలు, 20 దేశాల లీడర్లతో మోదీ భేటీ

ఢిల్లీలో ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహించనున్న AI Impact Summit కోసం కేంద్రం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాని మోదీ 35-40 టాప్ కంపెనీల సీఈవోలు, 20 దేశాల లీడర్లతో భేటీ కానున్నారు. లిస్టులో ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, ఆంథ్రోపిక్, నెట్ఫ్లిక్స్, జూమ్, అమెజాన్ తదితర సంస్థలున్నాయి. దాదాపు $100 బిలియన్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. పీపుల్-ప్లానెట్-ప్రోగ్రెస్ అంశాలపై ఈ సమ్మిట్ జరగనుంది.


