News May 24, 2024

TODAY HEADLINES

image

* AP: మాచర్ల ఎమ్మెల్యే PRKకు ఊరటనిచ్చిన హైకోర్టు
* రిగ్గింగ్ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు: అనిల్ కుమార్
* చంద్రబాబు వద్ద కొత్త ప్యాకేజీ స్టార్ ప్రశాంత్ కిషోర్: వైసీపీ
* TG: మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి: కేటీఆర్
* సీఎంకు రైతుల కంటే ఎన్నికలే ముఖ్యం: కిషన్ రెడ్డి
* జూన్ 4 తర్వాత వైసీపీ దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
* ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Similar News

News January 5, 2026

గేదెలు, ఆవుల్లో ఈ తేడాను గమనించారా?

image

గేదెల కంటే ఆవులకే తెలివితేటలు ఎక్కువట. ఒక గేదెను 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వదిలేస్తే ఇంటికి తిరిగి రాలేదు. దాని జ్ఞాపక శక్తి గోవుతో పోలిస్తే చాలా తక్కువ. అదే ఆవును 10km దూరం తీసుకెళ్లి వదిలేసినా ఇంటిదారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుందట. 10 గేదెలను కట్టి వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్కపిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు. ఆవు దూడలు అలాకాదట, తనతల్లి కొన్ని వందల ఆవుల మధ్యలో ఉన్నా గుర్తిస్తాయట.

News January 5, 2026

ఇతిహాసాలు క్విజ్ – 118 సమాధానం

image

ప్రశ్న: పాండవులు స్వర్గానికి వెళ్తుండగా ధర్మరాజును చివరి వరకు అనుసరించి, ఆయనతో పాటు స్వర్గం వరకు వెళ్లిన జంతువు ఏది? ఆ జంతువు రూపంలో ఉన్నది ఎవరు?
సమాధానం: ధర్మరాజును చివరి వరకు అనుసరించిన జంతువు కుక్క. నిజానికి ఆ కుక్క రూపంలో ఉన్నది యముడు. తనను నమ్ముకున్న ఆ మూగజీవిని వదిలి స్వర్గానికి రావడానికి ధర్మరాజు నిరాకరిస్తాడు. అతని ధర్మనిష్ఠను, కరుణను పరీక్షించడానికే యముడు ఆ రూపంలో వచ్చాడు. <<-se>>#Ithihasaluquiz<<>>

News January 5, 2026

ఐకానిక్ వంతెనకు టెండర్లు.. తగ్గనున్న 90kmల దూరం

image

ఏపీ-తెలంగాణను కలుపుతూ సోమశిల వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి కేంద్రం టెండర్లు ఆహ్వానిస్తోంది. 1077 మీటర్ల పొడవైన హైబ్రిడ్ వంతెనను EPC విధానంలో నిర్మించనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.816.10 కోట్లు కాగా, 36 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నంద్యాల, తిరుపతికి వెళ్లాలంటే కర్నూలు మీదుగా వెళ్లాల్సి ఉండగా ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే 90kmల దూరం తగ్గనుంది.