News May 24, 2024
TODAY HEADLINES

* AP: మాచర్ల ఎమ్మెల్యే PRKకు ఊరటనిచ్చిన హైకోర్టు
* రిగ్గింగ్ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు: అనిల్ కుమార్
* చంద్రబాబు వద్ద కొత్త ప్యాకేజీ స్టార్ ప్రశాంత్ కిషోర్: వైసీపీ
* TG: మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి: కేటీఆర్
* సీఎంకు రైతుల కంటే ఎన్నికలే ముఖ్యం: కిషన్ రెడ్డి
* జూన్ 4 తర్వాత వైసీపీ దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి
* ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Similar News
News January 21, 2026
ఉ.10 గం. వరకు పొగమంచు.. వాహనదారులు జాగ్రత్త!

AP: మరో రెండు రోజుల పాటు తెల్లవారుజాము నుంచి ఉ.10 గం. వరకు పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల విజిబిలిటీ వంద మీటర్ల కంటే తక్కువగా నమోదవుతుందని, యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది. మరోవైపు కోస్తా, రాయలసీమలో చలి తీవ్రత పెరిగింది. నిన్న అరకు లోయలో 5.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News January 21, 2026
వరిలో పాముపొడ(మాగుడు) తెగులు – నివారణ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాలిలో తేమ వల్ల వరిలో పాముపొడ తెగులు ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. వరి దుబ్బు చేసే దశలో ఇది వ్యాపిస్తుంది. వరి కాండం, ఆకులపై పాము పొడ లాంటి మచ్చలు కనిపిస్తాయి. తెగులు తీవ్రమైతే మొక్కలు ఎండి, తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400ml హెక్సాకొనజోల్ 5 SP లేదా 400ml వాలిడామైసిన్ 3 SL లేదా 200ml ప్రోపికొనజోల్ 25% EC కలిపి పిచికారీ చేయాలి.
News January 21, 2026
దానిమ్మ రైతులకు కాసుల పంట.. టన్ను రూ.2 లక్షలు

AP: దానిమ్మ రైతులకు మంచి రోజులు వచ్చాయి. 3 నెలల క్రితం టన్ను రూ.50వేల నుంచి రూ.60 వేల వరకు పలికిన దానిమ్మ ఇప్పుడు ఏకంగా రూ.2 లక్షలు పలుకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట తెగుళ్లు, బ్యాక్టీరియా బారిన పడకుండా జాగ్రత్తగా సాగు చేయడం వల్లే రేట్లు పెరిగాయని చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో 15వేలకు పైగా హెక్టార్లలో (ప్రధానంగా రాయలసీమ) దానిమ్మ పంట పండిస్తున్నారు.


