News June 18, 2024
TODAY HEADLINES
✒ బెంగాల్లో రైలు ప్రమాదం.. 9 మంది దుర్మరణం
✒ వయనాడ్ MP పదవికి రాహుల్ రాజీనామా.. ప్రియాంకా గాంధీ పోటీ
✒ AP: రేషన్ షాపుల్లో 1 నుంచి బియ్యంతోపాటు కందిపప్పు
✒ AP: ‘పోలవరం’ పూర్తికి మరో 4 సీజన్లు: CM
✒ AP: 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
✒ AP: 22న పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ
✒ TG: 28 మంది ఐపీఎస్ల బదిలీ
✒ TG: BRS పార్లమెంటరీ నేతగా సురేశ్రెడ్డి
Similar News
News February 2, 2025
SHOCKING: భర్త కిడ్నీ అమ్మేసి ప్రియుడితో పరారైన భార్య!
ఆమెకు పెళ్లై ఓ కూతురు ఉంది. అయినా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించింది. అతడితో కలిసి పారిపోవాలనుకుంది. అలా వెళ్లిపోతే ఒకెత్తు. కానీ మరీ అన్యాయంగా భర్త కిడ్నీని భర్తతోనే విక్రయింపచేసింది. కూతురి జీవితానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని నమ్మబలికింది. ఆమెను నమ్మిన భర్త కిడ్నీ అమ్మేసి రూ.10 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బును తీసుకుని ప్రియుడితో పరారైందా ఇల్లాలు. బెంగాల్లోని హౌరా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
News February 2, 2025
అభిషేక్ ఇన్నింగ్సుపై యువరాజ్ ట్వీట్
ఇంగ్లండ్పై దండయాత్ర చేసిన భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మను అతని కోచ్, మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ప్రశంసల్లో ముంచెత్తారు. అద్భుతంగా ఆడావని కొనియాడారు. ఇదే ఆటను తాను చూడాలనుకున్నానని, గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ మ్యాచులో 37 బంతుల్లో సెంచరీ చేసిన అభి, మొత్తంగా 54 బాల్స్లో 13 సిక్సర్లతో 135 రన్స్ చేశారు.
News February 2, 2025
5 మ్యాచుల్లో 35 పరుగులే
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో భారత ప్లేయర్ సంజూ శాంసన్ పేలవ ప్రదర్శన చేశారు. ఆడిన 5 మ్యాచుల్లో 7 సగటుతో 35 పరుగులే చేశారు. ఇవాళ్టి మ్యాచులో సిక్సర్తో ఇన్నింగ్స్ ప్రారంభించి ఊపు మీదున్నట్లు కనిపించినా రెండో ఓవర్లోనే పుల్ షాట్ ఆడి క్యాచ్ ఔట్గా వెనుదిరిగారు. దీంతో శాంసన్కు ఇంకా ఎన్ని అవకాశాలు ఇవ్వాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. గైక్వాడ్ వంటి ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.