News July 24, 2024
TODAY HEADLINES

* రూ.48.21 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మల
* మధ్యతరగతికి భరోసా ఇచ్చే బడ్జెట్: మోదీ
* AP: బడ్జెట్ నిధులతో రాష్ట్రానికి ఎంతో ఊరట: చంద్రబాబు
* TG: బడ్జెట్లో తెలంగాణ పదం నిషేధించారు: రేవంత్
* తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
* మహిళల ఆసియాకప్లో సెమీస్ దూసుకెళ్లిన భారత్
* ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడి 229 మంది మృతి
Similar News
News January 22, 2026
సీఎం రేవంత్తో మంత్రి లోకేశ్ భేటీ

దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ను శాలువాతో సత్కరించారు. ఇరు రాష్ట్రాల్లోని విద్యా సంస్కరణలు, ఐటీ అభివృద్ధి, స్కిల్ డెలవప్మెంట్పై తామిద్దరం చర్చించినట్లు లోకేశ్ తెలిపారు. కాగా దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునూ సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది.
News January 22, 2026
భోజ్శాలలో సరస్వతీ పూజ, నమాజ్కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ధార్(MP)లోని వివాదాస్పద భోజ్శాల కాంప్లెక్స్లో రేపు (జనవరి 23) వసంత పంచమి సరస్వతీ పూజ, నమాజ్ రెండూ జరుపుకొనేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది. హిందువులు రోజంతా పూజలు నిర్వహించుకోవడానికి అనుమతించింది. ఇద్దరికీ వేర్వేరు దారులు ఉండేలా చూడాలని, ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించింది.
News January 22, 2026
అక్రమ సంబంధాలు.. కుటుంబాలు నాశనం!

కొందరు మహిళలు అక్రమ సంబంధాలకు అలవాటుపడి పచ్చని కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. HYD కూకట్పల్లిలో ప్రసన్న భర్త మెడకు చున్నీ బిగించి చంపేయగా, గుంటూరు(D) చిలువూరులో భార్య లక్ష్మి భర్తను ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అటు భార్యలపై అనుమానాలతో భర్తలు వారిని చంపుతున్న ఘటనలూ పెరిగిపోయాయి. HYD రహ్మత్నగర్లో భర్త ఆంజనేయులు భార్య సరస్వతిని, అనంతపురంలో వీరాంజనేయులు తన భార్య లక్ష్మిని చంపేశారు.


