News July 24, 2024
TODAY HEADLINES

* రూ.48.21 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మల
* మధ్యతరగతికి భరోసా ఇచ్చే బడ్జెట్: మోదీ
* AP: బడ్జెట్ నిధులతో రాష్ట్రానికి ఎంతో ఊరట: చంద్రబాబు
* TG: బడ్జెట్లో తెలంగాణ పదం నిషేధించారు: రేవంత్
* తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
* మహిళల ఆసియాకప్లో సెమీస్ దూసుకెళ్లిన భారత్
* ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడి 229 మంది మృతి
Similar News
News January 28, 2026
ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ

AP: పింఛన్దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెల పెన్షన్ను జనవరి 31వ తేదీనే పంపిణీ చేయనుంది. ఫిబ్రవరి 1న ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జనవరి 30నే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలని ఆదేశించింది. కాగా రాష్ట్రంలో ప్రతి నెలా దాదాపు 63 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే.
News January 28, 2026
రిటైర్మెంట్ వెనుక కారణం చెప్పిన అర్జిత్ సింగ్

బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్కు <<18977435>>రిటైర్మెంట్<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్లో ఉన్న సమయంలో ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కొత్త తరం గాయకులకు అవకాశాలు కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు. సినిమాలకు గుడ్బై చెప్పినా, ఇండిపెండెంట్ సింగర్గా తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News January 28, 2026
అలసంద మొక్కల ఆకులను పురుగులు తినేస్తున్నాయా?

అలసంద పంటను ఆకు తినే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ పురుగులు ఆకులను తినేయడం వల్ల మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. వీటి తీవ్రత పెరిగితే దిగుబడిపై కూడా ప్రభావం పడుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 5ml వేప గింజల కషాయాన్ని లేదా లీటరు నీటికి 3ml అజాడిరక్టిన్ (3000 PPM) చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


