News August 21, 2024
TODAY HEADLINES

➢AP: తక్కువ ధరకే విద్యుత్ అందించేలా చర్యలు: CM CBN
➢ఏపీలో CBI విచారణకు ప్రభుత్వం అనుమతి
➢TG: సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం: CM రేవంత్
➢22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు
➢రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయాలి: హరీశ్ రావు
➢TG: రూ.7,500కోట్లే మాఫీ జరిగినట్లుంది: భట్టి
➢AP:నన్ను చంపాలని చూస్తున్నారు: కేతిరెడ్డి
➢AP:ఈ నెల 23 నుంచి గ్రామ సభలు
Similar News
News November 17, 2025
NGKL: చివరి కార్తిక సోమవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

చివరి కార్తీక సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా, భజనలు, హారతులతో భక్తి, సందడి వాతావరణం నెలకొంది.
News November 17, 2025
గొర్రె పిల్లలకు అందించే క్రీపు దాణా తయారీ నమూనా ఫార్ములా

100 కిలోల క్రీపు దాణా తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ నలగగొట్టిన మొక్కజొన్నలు 40 కిలోలు ☛ తవుడు 20 కిలోలు ☛ నూనె తీసిన చెక్క 30 కిలోలు ☛ పప్పులపరం 7 కిలోలు ☛ కిలో ఉప్పు ☛ లవణ మిశ్రమం 2 కిలోలు. వీటిని మిక్స్ చేసి క్రీపు దాణా తయారు చేసుకోవచ్చు. ఈ దాణాను గొర్రె పిల్లలకు 3 నుంచి 7 వారాల వరకు తల్లిపాలతో పాటు అందించాలి. దీన్ని గొర్రె పిల్లల శరీర బరువులో ఒకటిన్నర శాతానికి మించకుండా రోజూ అందించాలి.
News November 17, 2025
సౌదీ ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు మృతి!.. CM దిగ్భ్రాంతి

సౌదీ <<18308554>>బస్సు<<>> ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 7997959754, 9912919545 నంబర్లకు కాల్ చేయాలని CS సూచించారు. అటు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు.


