News August 23, 2024

TODAY HEADLINES

image

AP: అచ్యుతాపురంలో సీఎం పర్యటన.. బాధితులకు పరామర్శ
AP: అచ్యుతాపురం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం
AP: రాష్ట్రంలో న్యాయం, ధర్మం కనిపించడం లేదు: జగన్
TG: రేషన్‌ లబ్ధిదారులకు జనవరి నుంచి సన్నబియ్యం
TG: అదానీ వ్యవహారంపై సీఎం రేవంత్ ధర్నా
TG: డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
* పార్టీ జెండాను విడుదల చేసిన తమిళ హీరో విజయ్

Similar News

News March 12, 2026

23న ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన: CM

image

APలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23న అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు CM CBN ప్రకటించారు. ఈ కార్యక్రమానికి PM మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రూ.1.35 లక్షల కోట్లతో 2 దశల్లో 5,300 ఎకరాల్లో స్టీల్‌ప్లాంట్‌ను నిర్మించనున్న విషయం తెలిసిందే.

News March 12, 2026

ఈ నెలలోనే రైతు భరోసా: మంత్రి వివేక్

image

TG: ‘రైతు భరోసా’ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ చేయనున్నట్లు చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెల్లడించారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9,000కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో తొలి విడతగా రూ.4,500కోట్లు, మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

News March 12, 2026

ప్రభుత్వ ఆఫీసుల్లో సర్టిఫికెట్లు అడగొద్దు: CM

image

AP: ప్రభుత్వాఫీసుల్లో ప్రజల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవడం ఆపాలని, ప్రస్తుత రోజుల్లో అది ఆమోదయోగ్యం కాదని CM CBN అన్నారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా సర్టిఫికెట్లను డిజిటల్ వెరిఫికేషన్ చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు సర్టిఫికెట్లతో తిరిగే అవసరం ఉండకూడదని స్పష్టం చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చేది ప్రభుత్వమే కావున వాటిని అన్ని శాఖలు చూడగలిగేలా సాఫ్ట్‌వేర్‌ను వాడుకోవాలన్నారు.