News October 6, 2024

ఇవాళ పాకిస్థాన్‌తో భారత్ పోరు

image

ఇవాళ మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. తొలి మ్యాచులో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమితో భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారీ విజయం నమోదు చేయాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 15 టీ20లు జరగ్గా భారత్ 12, పాక్ 3 మ్యాచుల్లో విజయం సాధించాయి. కాగా మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

Similar News

News January 27, 2026

‘జననాయగన్’ సెన్సార్ వివాదంపై నేడు తీర్పు

image

తమిళ హీరో, TVK అధినేత విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’ (తెలుగులో జన నాయకుడు) సెన్సార్ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. సెన్సార్ <<18907956>>వివాదంపై<<>> మద్రాస్ హైకోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అనుకూలంగా తీర్పు వస్తే ఫిబ్రవరి 6న మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు నటించారు.

News January 27, 2026

మాఘ పౌర్ణమి రోజున రామకృష్ణ తీర్థంలో ఏం చేస్తారంటే..?

image

మాఘ పౌర్ణమి నాడు ఈ తీర్థంలో ముక్కోటి వేడుక వైభవంగా సాగుతుంది. ఆరోజు ఉదయం శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాల నడుమ పూలు, పండ్లు, ప్రసాదాలు, పూజా సామగ్రిని ఊరేగింపుగా తీర్థానికి తీసుకెళ్తారు. అక్కడ వెలసిన రాముడు, కృష్ణుడి విగ్రహాలకు అభిషేకాలు, పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఈ పవిత్ర దినాన తీర్థ స్నానం చేస్తే విశేష ఫలితాలుంటాయని నమ్మకం.

News January 27, 2026

మహిళలూ బంగారం జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో తరచుగా ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. బంగారం లాక్కొని పారిపోతున్నారు. దీంతో గోల్డ్ ధరించి బయటికి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. సంక్రాంతి తర్వాత HYD పరిధిలో 8 చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. జగిత్యాల, NZB, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఇటీవల ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. అందుకే బంగారంతో బయటకు వెళ్తే జాగ్రత్త.