News July 27, 2024
టెన్నిస్ ఫ్యాన్స్కు ఈరోజు ‘డబుల్’ ధమాకా

పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు టెన్నిస్ షెడ్యూల్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. మెన్స్ డబుల్స్ విభాగంలో భారత్ తరఫున ఎన్ బాలాజీ, రోహన్ బొప్పన్న జోడీ రోజర్-రెబౌల్ (ఫ్రాన్స్) ద్వయంతో తలపడనుంది. మరోవైపు స్పెయిన్ – అర్జెంటీనా మ్యాచ్ కోసమూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్, యువ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ కలిసి ఆడనుండటంతో మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. <<-se>>#Olympics2024<<>>
Similar News
News January 11, 2026
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్(<
News January 11, 2026
చర్మానికి స్క్రబ్ ఎందుకు చెయ్యాలంటే?

పని ఒత్తిడిలో పడి చాలామంది చర్మ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. దీంతో మృతకణాలు చేరి చర్మం నిర్జీవంగా మారుతుంది. అందుకే వీలు దొరికినప్పుడు శరీరం మొత్తానికి అంటే వీపు, మెడ, కాళ్లకు స్క్రబ్బింగ్ చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. దీనికోసం బాత్సాల్ట్, డీప్ క్లెన్సింగ్ మిల్క్ వాడొచ్చు. లేదంటే గులాబీరేకల ముద్దలో తేనె, పాలు, ఉలవపిండి కలిపి చర్మానికి పట్టించి స్క్రబ్ చెయ్యాలి. దీనివల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి.
News January 11, 2026
ఇకపై ప్రతివారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు: భట్టి

TG: ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి వారం నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని రామగుండం పర్యటనలో అన్నారు. స్థానికంగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటివరకు నిధుల లభ్యతను బట్టి సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.


