News July 27, 2024
టెన్నిస్ ఫ్యాన్స్కు ఈరోజు ‘డబుల్’ ధమాకా

పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు టెన్నిస్ షెడ్యూల్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. మెన్స్ డబుల్స్ విభాగంలో భారత్ తరఫున ఎన్ బాలాజీ, రోహన్ బొప్పన్న జోడీ రోజర్-రెబౌల్ (ఫ్రాన్స్) ద్వయంతో తలపడనుంది. మరోవైపు స్పెయిన్ – అర్జెంటీనా మ్యాచ్ కోసమూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్, యువ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ కలిసి ఆడనుండటంతో మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. <<-se>>#Olympics2024<<>>
Similar News
News September 15, 2025
గ్రామాల్లో మహిళా ఓటర్లే అత్యధికం: ఈసీ

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లకు గానూ ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు 5,763 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను వెల్లడించింది. వీరిలో మహిళా ఓటర్లు 85,35,935 మంది కాగా పురుషులు 81,66,732 మంది ఉన్నారని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 4 లక్షలకుపైగా ఎక్కువని పేర్కొంది.
News September 15, 2025
దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

ఒడిశాలో ఓ హాస్టల్ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

<