News July 29, 2024
ఇవాళ సెలవు

TG: రాష్ట్ర పండుగ ‘బోనాలు’ సందర్భంగా ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. GOVT ఆఫీసులు కూడా మూతపడనున్నాయి. గోల్కొండ జగదాంబిక, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని, ఇతర అమ్మవారి దేవస్థానాలకు భక్తులు పోటెత్తుతున్నారు. జులై 7న భాగ్యనగరంలో ప్రారంభమైన బోనాల సంబరాలు ఆగస్టు 4 వరకు కొనసాగనున్నాయి.
Similar News
News November 7, 2025
దక్షిణ మధ్య రైల్వేలో 61 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 7, 2025
తరచూ ఛాతి ఎక్స్రేలు తీయించుకుంటున్నారా?

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
News November 7, 2025
వేమూరి వినోద్ అరెస్ట్.. రిమాండ్కు తరలింపు

AP: కర్నూలు బస్సు <<18110276>>ప్రమాద ఘటన<<>>లో వి.కావేరి ట్రావెల్స్ యజమాని, A2 వేమూరి వినోద్ కుమార్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ వెల్లడించారు. కర్నూలు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. OCT 28న A1 డ్రైవర్ లక్ష్మణ్ను అరెస్టు చేశారు. గత నెల జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.


