News September 14, 2024
ఇవాళ భారత్ VS పాకిస్థాన్ మ్యాచ్

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్లు ఇవాళ తలపడనున్నాయి. వరుస విజయాలతో భారత్ ఇప్పటికే సెమీఫైనల్ చేరింది. ఇవాళ నామమాత్రపు మ్యాచ్ అయినా దాయాదుల పోరు కావడంతో హైవోల్టేజ్ ఉండటం పక్కా. మ.1.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. సోనీ స్పోర్ట్స్లో చూడొచ్చు.
☘ALL THE BEST INDIA
Similar News
News January 23, 2026
‘హంద్రీనీవా’కు 40TMCల నీరు…CMకు థాంక్స్

AP: హంద్రీనీవా విస్తరణకు కృషిచేసి రాయలసీమకు నీళ్లందించారని CM CBNకు
మంత్రులు కేశవ్, జనార్దన్, MLA కాల్వ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. 190 రోజుల్లో 40 TMCల నీటిని విడుదల చేసి రికార్డు సృష్టించినట్లు చెప్పారు. 2014-19 మధ్య 6 పంపులుండగా ఇపుడు 100 రోజుల్లో 12 పంపుల సామర్థ్యానికి పెంచడంతో ఇది సాధ్యమైందన్నారు. కాగా మార్చి నాటికి 50 TMCలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మలకు CM సూచించారు.
News January 23, 2026
పూర్తిగా సహకరించా: KTR

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘రెండేళ్ల విచారణలో లీకులు ఎందుకు ఇస్తున్నారని సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించా. పార్టీ నేతలపై వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులని అడిగా’ అని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.
News January 23, 2026
MBBS సీటు కోసం కాలును నరుక్కున్నాడు

దివ్యాంగుల కోటాలో మెడికల్ సీటు పొందేందుకు ఓ వ్యక్తి తన కాలును తానే నరుక్కున్నాడు. UPలోని జౌన్పూర్(D)కు చెందిన సూరజ్ భాస్కర్ (20) NEET పరీక్షలో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. దివ్యాంగుల కోటాలో అయితే ఈజీగా సీటు వస్తుందని భావించి కాలును నరుక్కుని దాడిలో కోల్పోయానంటూ నాటకమాడాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అతనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు న్యాయ సలహా కోరారు.


