News April 7, 2025

నేడు భద్రాచలం శ్రీరాముడి మహాపట్టాభిషేకం

image

TG: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నేడు రామయ్యకు మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉ.10.30 గం. నుంచి మ.12.30 వరకు కళ్యాణ మండపంలో అభిషేక మహోత్సవం ఉంటుంది. ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, చక్రాలు, కిరీటం, శంఖు ధరింపజేస్తారు. ఏటా శ్రీరామనవమి తర్వాత నిర్వహించే ఈ వేడుకకు ఈసారి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Similar News

News September 13, 2025

మోదీ మణిపుర్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు

image

ఘర్షణలు జరిగిన రెండేళ్ల తర్వాత PM మోదీ మణిపుర్‌ <<17696611>>పర్యటన<<>>కు వెళ్లడం అక్కడి ప్రజలను అవమానించడమేనని INC మండిపడింది. ‘864 రోజుల ఘర్షణలో 300 మంది చనిపోయారు. 1500 మంది గాయపడ్డారు. 67వేల మంది నిర్వాసితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు PM 46 విదేశీ పర్యటనలు చేశారు కానీ ఒక్కసారి కూడా మణిపుర్‌లో పర్యటించలేదు’ అని ఖర్గే విమర్శించారు. రెండేళ్ల తర్వాత మోదీ మణిపుర్ వెళ్లడం దురదృష్టకరమని ప్రియాంకా గాంధీ అన్నారు.

News September 13, 2025

కుక్కలను చంపి పాపం మూటగట్టుకోవద్దు: మంత్రి

image

TG: వీధి కుక్కల సమస్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘US లాంటి దేశాల్లో మనుషుల్లాగే కుక్కలకూ విలువ ఇస్తున్నారు. వాటిని చంపాల్సిన అవసరం లేదు. పాపం మూటగట్టుకోవద్దు. దత్తత తీసుకునే కార్యక్రమాలకు సహకారం అందిస్తాం. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్‌పై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలి. కుక్క కాటుకు గురికాకుండా, ఒకవేళ గురైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి’ అని సూచించారు.

News September 13, 2025

IOBలో 127 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌(IOB)లో 127 స్పెషలిస్టు ఆఫీసర్స్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. అభ్యర్థులు అక్టోబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/బీఆర్క్‌/బీటెక్‌/బీఈ/ ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్‌/ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఏలో ఉత్తీర్ణత సాధించాలి. 01-09-2025 నాటికి 25-40 ఏళ్లు ఉన్నవారు అర్హులు. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://www.iob.in/<<>>