News March 17, 2024

నేడు ఢిల్లీ-బెంగళూరు మధ్య ఫైనల్ పోరు

image

WPLలో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లూ తొలిసారి టైటిల్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. అలాగే ఢిల్లీకి రెండోసారి. ఎవరు గెలిచినా చరిత్ర సృష్టించనున్నారు.

Similar News

News December 30, 2024

‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ ఇప్పుడెలా ఉన్నాడంటే?

image

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. రెండు రోజులుగా మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్‌తో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. న్యూరోలాజికల్ స్టేటస్‌లో పెద్దగా మార్పు లేదన్నారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని, పైప్ ద్వారానే ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి జ్వరం లేదని వివరించారు.

News December 30, 2024

శివాజీ విగ్రహం ఏర్పాటుపై అభ్యంత‌రాలు!

image

లద్దాక్‌లోని పాంగాంగ్ సరస్సు ఒడ్డున ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుపై తమ అభిప్రాయాల‌ను ప‌ట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ నిర్ణ‌యం స్థానికుల్ని అసంతృప్తికి గురి చేసింద‌ని, ఈ ప్రాంతంలో ఉన్న ప్ర‌త్యేక వాతావ‌ర‌ణం-వైల్డ్‌లైఫ్‌కి విగ్ర‌హ ఏర్పాటుకు ఉన్న సంబంధం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల్ని, ప్ర‌కృతికిని గౌర‌వించే ప్రాజెక్టుల‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని స్థానికులు కోరుతున్నారు.

News December 30, 2024

75 రోజుల్లో రూ.6,312 కోట్ల మద్యం తాగేశారు

image

AP: రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ ప్రకటించిన తర్వాత అమ్మకాలు జోరందుకున్నాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 మధ్య 75 రోజుల్లోనే రూ.6,312 కోట్ల విలువైన లిక్కర్ సేల్ అయినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 83,74,116 కేసుల లిక్కర్, 26,78,547 కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది. ఇవాళ, రేపు, జనవరి 1న మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేసింది.