News June 24, 2024

నేడు ఏపీ కేబినెట్ తొలి భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, పింఛన్ల పెంపుపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రులు సమాలోచనలు చేయనున్నారు. అలాగే సూపర్-6 పథకాల అమలుపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియపరిచేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు.

Similar News

News September 18, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(పట్టణ రవాణా శాఖ)గా బాధ్యతలు.. CM రేవంత్‌ను కలిసిన NVS రెడ్డి
* SEP 21న చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ ఆడనున్న కల్వకుంట్ల కవిత
* HYDలో భారీ వర్షం.. GHMC, హైడ్రా, పోలీస్, విద్యుత్ విభాగాలు సమన్వయం చేసుకోవాలన్న మంత్రి పొన్నం
* మూసీకి వరద.. అంబర్‌పేట్-మూసారాంబాగ్ బ్రిడ్జి క్లోజ్
* SEP 21-30 వరకు జరిగే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొనాలి: మంత్రి జూపల్లి

News September 18, 2025

రేపు OTTలోకి ‘మహావతార్ నరసింహ’

image

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. రేపటి నుంచి Netflixలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

News September 18, 2025

పలు ఆలయాల బోర్డులకు ఛైర్మన్ల నియామకం

image

AP: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది.
1.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం(శ్రీశైలం)- P.రమేశ్ నాయుడు
2.శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం- కొట్టె సాయి ప్రసాద్
3.శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం(కాణిపాకం)- V.సురేంద్ర బాబు
4.శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం(ఇంద్రకీలాద్రి)- B.రాధాకృష్ణ
5.శ్రీ వేంకటేశ్వర ఆలయం(వాడపల్లి)- M.వెంకట్రాజు