News April 19, 2024

నేడే లోక్‌సభ తొలి విడత ఎన్నికలు

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 21 రాష్ట్రాలు/యూటీల్లోని 102 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. తమిళనాడు, రాజస్థాన్, UP, మధ్యప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, బిహార్, బెంగాల్, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్, లక్షద్వీప్‌లలో పోలింగ్ జరగనుంది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, త్రిపురలోనూ ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News January 26, 2026

మంత్రులు భేటీ అయితే తప్పేముంది: మహేశ్

image

TG: నలుగురు మంత్రులు అత్యవసరంగా <<18968187>>సమావేశమయ్యారనే<<>> వార్తలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు పరిపాలనా అంశంలో మంత్రులు భేటీ అయితే తప్పేమీ లేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి ఈ విషయంగానే సమావేశం నిర్వహించినట్లు భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ విదేశాల నుంచి వచ్చాక హైకమాండ్‌తో చర్చిస్తామని తెలిపారు.

News January 26, 2026

పాక్‌ను ఇండియన్స్ ఉతికి ఆరేస్తారు.. T20 WCపై మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు

image

ప్రస్తుతం T20ల్లో టీమ్ ఇండియా ఫామ్‌ను చూసి ఆడటానికి ఏ జట్టైనా భయపడుతుందని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఇలాంటి బాదుడును తానెప్పుడూ చూడలేదంటూ న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఇండియన్ ప్లేయర్స్ విధ్వంసకర బ్యాటింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాక్ T20 WCకు రాకపోవడమే మంచిదని.. లేదంటే ఉతికి ఆరేస్తారని సరదాగా అన్నారు. కొలంబోలో సిక్స్ కొడితే మద్రాస్‌లో పడుతుందంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు.

News January 26, 2026

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రధానికి ధర్మాన లేఖ

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై PM మోదీకి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. భూమి రికార్డులను ఆధునికీకరించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా YCP చట్టం తెచ్చినట్లు వివరించారు. CBN ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందన్నారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ముసాయిదా బిల్లును అన్ని రాష్ట్రాలు చట్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు CMలతో సమావేశమై చర్చించాలని సూచించారు.