News April 28, 2024
పాలిసెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు

TG: పాలిటెక్నిక్, డిప్లొమా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2024కు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కాగా ఆలస్య రుసుము రూ.100తో ఈ నెల 30 వరకు, రూ.300తో మే 20 వరకు అప్లై చేసుకోవచ్చని సాంకేతిక విద్యాశిక్షణ మండలి అధికారులు తెలిపారు. వచ్చే నెల 24న పరీక్షలు నిర్వహించి, పది రోజుల తర్వాత ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 23, 2025
ఎంపీ, ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు: కేంద్ర మంత్రి

ప్రతి MP, MLA అభివృద్ధి నిధుల్లో కమీషన్ తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాఝీ వ్యాఖ్యానించారు. ‘నేను కూడా కమీషన్ తీసుకున్నాను. దాన్ని పార్టీకి ఇచ్చేవాడిని. మీరు కనీసం 5% కమీషన్ అయినా తీసుకోవాలి’ అని HAM(S) పార్టీ మీటింగ్లో నేతలకు సూచించారు. MPకి ₹5CR వరకు అభివృద్ధి నిధి ఉంటుందని, 10% కమీషన్ తీసుకున్నా ₹40 లక్షలకు పైనే వస్తుందని అన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
News December 23, 2025
జనవరి 1 నుంచి భీమాశంకర్ టెంపుల్ క్లోజ్

జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమాశంకర్ ఆలయం(MH) 2026 JAN 1 నుంచి మూతపడనుంది. ఆలయ అభివృద్ధి ప్లాన్లో భాగంగా ప్రధాన ఆలయ సభా మండపాన్ని రెనోవేట్ చేయనున్నారు. నిర్మాణ పనులు జరిగే టైంలో భక్తుల సేఫ్టీ దృష్ట్యా ఆలయంలో దర్శనాలను 3 నెలలపాటు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని ఈ టెంపుల్ ఆధ్యాత్మిక ప్రేమికులకు మాత్రమే కాదు నేచర్ లవర్స్, ట్రెక్కింగ్ చేసే వారికీ ఫేవరెట్ స్పాట్గా ఉంది.
News December 23, 2025
అప్పు చేసి మరీ ఎంజాయ్ చేస్తున్న మన కుర్రకారు.. మరి చైనాలో?

భారత యువత అవసరం కోసమో, ఆస్తుల కోసమో కాకుండా.. ఎంజాయ్ చేయడానికే అప్పులు చేస్తున్నారట. ఈ ఏడాదిలో మన కుర్రకారు తీసుకున్న పర్సనల్ లోన్లలో 27% టూర్ల కోసమేనని తేలినట్లు ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా తెలిపారు. మరోవైపు చైనా యువత మాత్రం బంగారం కొంటూ భవిష్యత్తు కోసం జాగ్రత్త పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనవాళ్లేమో రేపటి సంపాదనపై ధీమాతో నేడు అప్పు చేసి మరీ ఖర్చు చేస్తున్నారు.


