News September 8, 2024
నేడు పారిస్ పారాలింపిక్స్ చివరి రోజు

పారిస్ పారాలింపిక్స్ ఆదివారంతో ముగియనుంది. చివరి రోజు మహిళల కయాక్ సింగిల్ 200M – KL1 సెమీఫైనల్స్లో భారత్ తరఫున పూజా ఓజా పోటీ పడుతున్నారు. మధ్నాహ్నం 1.30 జరిగే సెమీస్ గెలిస్తే, 2.55 గంటలకు ఫైనల్లో పోటీపడాల్సి ఉంటుంది. ఈ పారాలింపిక్స్ భారత్కు ఒక మైలురాయి. గతం కంటే ఘనంగా ఈసారి 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో భారత బృందం 29 పతకాలు గెలుచుకుంది.
Similar News
News October 18, 2025
DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లు

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (DRDE) 5 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ల కోసం దరఖాస్తులు కోరుతోంది. BE, B.Tech, B.TEXT, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు NET, CSIR-UGC NET, గేట్ స్కోరు సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్వాలియర్లో DRDEలో నవంబర్ 6న ఉదయం 9.30గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్: https://www.drdo.gov.in
News October 18, 2025
మాక్ అసెంబ్లీ.. 21 నుంచి విద్యార్థుల ఎంపిక

AP: అమరావతిలో వచ్చే నెల 26న విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. అందుకోసం ఈ నెల 21, 22 తేదీల్లో 6-8 తరగతుల విద్యార్థులకు పాఠశాల స్థాయిలో వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు జరగనున్నాయి. 24, 25 తేదీల్లో మండలస్థాయి పోటీలు, ఈ స్థాయి నుంచి ఆరుగురిని సెలెక్ట్ చేసి 29, 30 తేదీల్లో నియోజకవర్గ లెవల్లో పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 175 మందిని ఎంపిక చేసి అమరావతి అసెంబ్లీకి తీసుకెళ్తారు.
News October 18, 2025
ఆధార్, వెబ్ ల్యాండ్ ఆధారంగా రబీ ఎరువుల పంపిణీ

AP: రబీ సీజన్ ఎరువుల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నంబరు, వెబ్ ల్యాండ్లో రైతుకున్న భూకమతం ఆధారంగా.. పంటల వారీగా, అగ్రికల్చర్ యూనివర్సిటీ సిఫారసు మేరకు ఎరువులను అందిచనుంది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు. రబీ సీజన్ సాగు సన్నద్ధత, ఎరువుల పంపిణీ అంశాలపై శుక్రవారం జిల్లాల వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు.